AP High Court: సీఐడీ చీఫ్‌ సంజయ్‌, ఏఏజీ పొన్నవోలుపై చర్యలకు హైకోర్టులో పిటిషన్‌

ఏపీ సీఐడీ చీఫ్‌ సంజయ్‌, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డిపై చర్యలకు ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

Updated : 01 Nov 2023 12:48 IST

అమరావతి: ఏపీ సీఐడీ చీఫ్‌ సంజయ్‌, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డిపై చర్యలకు ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. స్కిల్‌ కేసు దర్యాప్తులో ఉండగా ప్రెస్‌మీట్లు పెట్టారంటూ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు సత్యనారాయణ పిటిషన్‌ వేశారు. ప్రెస్‌మీట్లతో ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆయన తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. ఆర్టీఐ ద్వారా వివరాలు అడిగినా ఇవ్వట్లేదని తెలిపారు. కోర్టు అనుమతితో మరోసారి ఆర్టీఐ ద్వారా వివరాలు అడగాలని.. ప్రజాధనం ఎంత వృథా అయిందో తెలపాలని హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం వచ్చే వారానికి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని