Ramoji Rao - PM Modi: రామోజీ ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమే ఆలోచించేవారు: ప్రధాని మోదీ

రామోజీ రావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

Published : 08 Jun 2024 08:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్: రామోజీ రావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రామోజీ రావు కుటుంబానికి ప్రధాని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్‌ చేశారు. ‘‘రామోజీరావు మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు. పాత్రికేయ, సినీ రంగంపై చెరగని ముద్రవేశారు. మీడియాలో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారు. ఆయన ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమే ఆలోచించేవారు’’ అని మోదీ తన పోస్టులో పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని