PM Modi: ప్రధాని మోదీ తెలంగాణ టూర్‌.. మార్చి 4, 5 తేదీల్లో పర్యటన

తెలంగాణలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటన ఖరారైంది. మార్చి 4, 5 తేదీల్లో ఆదిలాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.

Published : 28 Feb 2024 14:12 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటన ఖరారైంది. మార్చి 4, 5 తేదీల్లో ఆదిలాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. 4న ఆదిలాబాద్‌ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. అదే రోజు రాత్రి హైదరాబాద్‌ చేరుకుని రాజ్‌భవన్‌లో బస చేయనున్నారు. 5న సంగారెడ్డి జిల్లా పర్యటనకు వెళ్లనున్న ప్రధాని.. అక్కడ పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. మరోవైపు మార్చి 4న తెలంగాణలో జరగాల్సిన కేంద్రహోంమంత్రి అమిత్‌షా పర్యటన రద్దయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని