PM Modi: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్రమోదీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తొలుత ఆలయం వద్దకు చేరుకున్న ప్రధానికి తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, అర్చకులు ఇస్తికఫాల్‌ స్వాగతం పలికారు.

Updated : 27 Nov 2023 11:11 IST

తిరుమల: ప్రధాని నరేంద్రమోదీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తొలుత ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న ప్రధానికి తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, అర్చకులు ఇస్తికఫాల్‌ స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం అనంతరం ప్రధానికి రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేశారు. ఆ తర్వాత మోదీకి శ్రీవారి చిత్రపటం, తీర్థప్రసాదాలను తితిదే ఛైర్మన్‌ అందజేశారు. ప్రధాని హోదాలో తిరుమల శ్రీవారిని మోదీ దర్శించుకోవడం ఇది నాలుగోసారి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని