PM Narendra Modi: రామోజీరావుపై ‘ఈనాడు’లో వ్యాసం.. సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనాన్ని తన ఎక్స్‌(ట్విటర్‌) ఖాతాలో పంచుకున్నారు.

Updated : 09 Jun 2024 14:14 IST

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనాన్ని సోషల్‌ మీడియా ఖాతాలో పంచుకున్నారు. రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావుకు నివాళులర్పిస్తూ రాసిన కథనం ఆదివారం ఈనాడు దినపత్రికలో ప్రచురితమైంది. దీన్ని ప్రధాని మోదీ తన ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతాలో షేర్‌ చేశారు. 

అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రామోజీరావు శనివారం కన్నుమూయడంతో ఆయనకు నివాళి అర్పిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ వ్యాసం రాశారు. ‘‘గడిచిన కొద్దివారాలు రాజకీయ నేతలకు, మీడియాకు తీరికలేకుండా గడిచాయి. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ఇటీవలే ముగిసింది. మూడోసారి ప్రభుత్వ ఏర్పాటు సన్నాహాల్లో మేం నిమగ్నమై ఉన్నవేళ నాకు ఒక విషాద వార్త అందింది. రామోజీరావు ఇక లేరని తెలిసింది. మా మధ్య ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా వ్యక్తిగతంగా ఇది నాకు తీవ్ర నష్టం. రామోజీరావు గురించి ఆలోచించగానే నా మనసులో ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి మెదిలారు. ఆయనకు ఆయనే సాటి. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన భిన్న రంగాల్లో అద్భుతంగా రాణించారు. సినిమాలు, వినోదం, మీడియా, వ్యవసాయం, విద్య, పాలనపై తనదైన ముద్ర వేశారు. అయినా జీవితపర్యంతం ఆయనలో వినమ్రత సడలలేదు. అలాగే మూలాలను ఎన్నడూ విస్మరించలేదు. ఈ గొప్ప లక్షణాలే ఆయనను అనేక మందికి ఆత్మీయుడిని చేశాయి’’ అని వ్యాసంలో పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని