TS News: నీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ప్రశాంత్ పాటిల్

సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ప్రశాంత్ పాటిల్ జీవన్‌ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది.

Published : 23 Feb 2024 18:08 IST

హైదరాబాద్‌: సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ప్రశాంత్ పాటిల్ జీవన్‌ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఇప్పటివరకు సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా ఉన్న ఆయన స్థానంలో మిక్కిలినేని మను చౌదరి నియమితులయ్యారు. జనగామ కలెక్టర్‌గా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రిజ్వాన్ బాషా షేక్‌ను నియమించారు. జనగామ కలెక్టర్‌గా ఉన్న సీహెచ్ శివలింగయ్యను బదిలీ చేసిన ప్రభుత్వం జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. దేవదాయ శాఖ ముఖ్యకార్యదర్శిగా శైలజ రామయ్యర్‌కు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని