Vijayawada: జగన్‌పై రాయిదాడి కేసు.. దుర్గారావు ఎక్కడ?

సీఎం జగన్‌పై రాయిదాడి కేసులో అదుపులోకి తీసుకున్న వేముల దుర్గారావు కోసం కుటుంబ సభ్యులు మరోసారి రోడ్డెక్కారు.

Published : 20 Apr 2024 19:24 IST

విజయవాడ: సీఎం జగన్‌పై రాయిదాడి కేసులో అదుపులోకి తీసుకున్న వేముల దుర్గారావు కోసం కుటుంబ సభ్యులు మరోసారి రోడ్డెక్కారు. నాలుగు రోజులుగా దుర్గారావు ఎక్కడ ఉన్నాడో పోలీసులు చెప్పడం లేదని, వెంటనే చూపించాలని అతని భార్య, కుటుంబ సభ్యులు, వడ్డెర సంఘం నాయకులు శనివారం విజయవాడ సీపీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. తన భర్త ఆచూకీ చెప్పాలని దుర్గారావు భార్య పోలీసులను వేడుకున్నారు. అతను ఏ తప్పూ చేయలేదని వాపోయారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని, సీపీ కార్యాలయం నుంచి ఆటోలో స్టేషన్‌కు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని