Weather Update: తెలంగాణలో పలు చోట్ల వర్షం.. పిడుగుపాటుకు ముగ్గురి మృతి

రాష్ట్రంలో పలు చోట్ల వర్షం కురుస్తోంది. వికారాబాద్‌ జిల్లాలోని యాలాల మండలం పరిధిలో రెండు చోట్ల పిడుగులు పడ్డాయి. 

Updated : 19 May 2024 18:30 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో పలు చోట్ల వర్షం కురుస్తోంది. వికారాబాద్‌ జిల్లాలోని యాలాల మండలం పరిధిలో రెండు చోట్ల పిడుగులు పడటంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. జంటుపల్లిలో పిడుగుపడి శ్రీనివాస్‌, లక్ష్మమ్మ మృతి చెందారు. బెన్నూరులో వెంకప్ప ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు సికింద్రాబాద్‌ పరిధిలోని బేగంపేట, ప్యారడైజ్‌, చిలకలగూడ, అల్వాల్‌, బోయిన్‌పల్లి, మారేడుపల్లి, జవహర్‌నగర్‌, సుచిత్ర, జీడీమెట్ల, కొంపల్లి తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు