Kishanreddy: మీడియా రంగంలో రామోజీరావు నూతన ఒరవడి సృష్టించారు: కిషన్‌రెడ్డి

మీడియా రంగంలో రామోజీరావు నూతన ఒరవడి సృష్టించారని తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు.

Published : 08 Jun 2024 20:40 IST

హైదరాబాద్‌: మీడియా రంగంలో రామోజీరావు నూతన ఒరవడి సృష్టించారని తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు పార్థివదేహానికి నివాళుర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘మద్యపాన నిషేధం, సామాజిక సమస్యలు, తెలుగు భాషను ప్రోత్సహించడం, సినిమా రంగంలో మార్పులు, ఫిల్మ్‌సిటీ నిర్మాణం ఇలా ఎన్నో విషయాల్లో రామోజీరావు చేసిన కృషిని మరచిపోలేము. 

వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నష్టాలను లెక్క చేయకుండా అన్నదాత పత్రికను నడిపించారు. తెలుగు భాష గురించి ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు. పద్మవిభూషణ్‌ పురస్కారం అందుకున్నారు. ఎవరికీ తలవంచకుండా పనిచేశారు. ఆయన తీర్చిదిద్దిన అనేక మంది జర్నలిస్టులు తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు. ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయాం. రాజ్యసభలో చోటు కల్పిస్తామని చెప్పినా సున్నితంగా తిరస్కరించారు. చివరి వరకు రామోజీ వ్యక్తిత్వం మారలేదు. ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు