Ramoji Rao: అసామాన్యుడికి అశ్రునివాళి.. కృష్ణాతీరంలో రామోజీరావు సైకత శిల్పం

రామోజీగ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు మృతికి గుంటూరు జిల్లాకు చెందిన సైకత శిల్పకారుడు బాలాజీ ఘనంగా నివాళులర్పించారు.

Updated : 08 Jun 2024 22:32 IST

గుంటూరు: రామోజీగ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు మృతికి గుంటూరు జిల్లాకు చెందిన సైకత శిల్పకారుడు బాలాజీ ఘనంగా నివాళులర్పించారు. మీడియా రంగానికి, సమాజానికి చేసిన సేవకు గుర్తుగా కృష్ణానదిలో ఆయన సైకత శిల్పాన్ని చెక్కారు. ఈనాడు, ఈటీవీ తనకు రెండు కళ్లు అని అనేక సందర్భాల్లో రామోజీరావు చెప్పిన మాటలకు సజీవరూపం కల్పించారు. రామోజీరావుకు కుడివైపున ఈటీవీ, ఎడమవైపున ఈనాడు వచ్చేలా బాలాజీ చెక్కిన శిల్పం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అసామాన్యుడికి అశ్రునివాళి అంటూ ఏర్పాటు చేసిన సైకత శిల్పం చూపరులను ఆకట్టుకుంటోంది. తనకు రామోజీరావు అంటే చాలా ఇష్టమని, ఆ ప్రేమను శిల్పం రూపంలో మలిచానని బాలాజీ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని