Andhra news: ఏపీలో పింఛన్ల సొమ్ము విడుదల.. ఈ సారీ బ్యాంకు ఖాతాల్లోనే

జూన్‌ నెలకు సంబంధించి సామాజిక భద్రతా పింఛన్ల సొమ్ము విడుదల చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.

Published : 29 May 2024 19:55 IST

అమరావతి: జూన్‌ నెలకు సంబంధించి సామాజిక భద్రతా పింఛన్ల సొమ్మును విడుదల చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. 65,30,808 మంది పెన్షనర్లకు రూ.1,939.35 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు  గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ వెల్లడించారు. జూన్ 1న నగదు బదిలీ ద్వారా 47,74,733 మంది బ్యాంకు ఖాతాలకు పింఛను సొమ్ము జమ చేయనున్నట్లు తెలిపారు. జూన్ ఒకటి నుంచి 5 వరకు ఇంటింటికీ వెళ్లి 17,56,105 మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తామన్నారు. ఎన్నికల నియమావళిని పాటిస్తూ పింఛన్లు పంపిణీ చేయాలని ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పింఛను నగదు ఇచ్చే అవకాశం ఉన్నా పింఛన్‌దారులను ఇళ్ల నుంచి బయటకు రప్పించి ఏప్రిల్‌ 1న గ్రామ, వార్డు సచివాలయాల్లో పంపిణీ చేసింది. మేలో బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసి వారిని మరింత ఇబ్బందులు పెట్టింది. ఇప్పుడూ అదే విధానాన్ని కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు