AP News: సీఐడీ చీఫ్, ఏఏజీ మీడియా సమావేశాల వ్యయంపై ఆర్టీఐ దరఖాస్తు
చంద్రబాబుపై నమోదు చేసిన కేసుల వివరాలను మీడియాకు వెల్లడించేందుకు సీఐడీ చీఫ్ సంజయ్, ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి చేసిన వ్యయంపై వివరాలు కోరుతూ ఆర్టీఐ పిటిషన్ దాఖలైంది.
విజయవాడ: తెదేపా అధినేత చంద్రబాబుపై నమోదు చేసిన కేసుల వివరాలను మీడియాకు వెల్లడించేందుకు సీఐడీ చీఫ్ సంజయ్, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసిన వ్యయంపై వివరాలు కోరుతూ రాష్ట్ర గవర్నర్ కార్యాలయంలో ఆర్టీఐ పిటిషన్ దాఖలైంది. ప్రతిపక్షనేతపై దాఖలు చేసిన కేసుల వివరాలను వెల్లడించేందుకు సీఐడీ చీఫ్, ఏఏజీలు నిధులు దుర్వినియోగం చేయడంపై ఫిర్యాదు చేసిన సమాచార హక్కు పిటిషనర్.. కేసు వివరాల వెల్లడికి ప్రజాధనం వ్యయం చేయడం ద్వారా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన ఇరువురిపై తీసుకున్న చర్యల వివరాలు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్పై ఆరా తీసిన రాజ్ భవన్.. దరఖాస్తులో కోరిన వివరాలను సమర్పించాలని హోంశాఖ కార్యదర్శికి పంపింది. ఈ వ్యవహారంలో సీఐడీ చీఫ్పై వచ్చిన ఆరోపణలు, తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశిస్తూ హోంశాఖ కార్యదర్శి హరీష్ కుమార్ గుప్త ఆయన కార్యాలయానికి నోట్ పంపారు. సీఐడీ చీఫ్ సంజయ్, అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి.. చంద్రబాబుపై నమోదైన కేసుల వివరాలను మీడియాకు వెల్లడించేందుకు చేసిన వ్యయం వివరాలు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర గవర్నర్ కార్యాలయానికి ఏపీ యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ అధ్యక్షుడు ఎన్ సత్యనారాయణ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల వీరంగం
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరులు వీరంగం సృష్టించారు. -
పింఛను దారులను అష్టకష్టాలు పెడుతున్న జగన్
తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో పింఛన్ కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతవులు గురువారం పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
4 కంటైనర్లలో రూ.2వేల కోట్లు పట్టివేత!
అనంతపురం జిల్లా పామిడి వద్ద నాలుగు కంటైనర్లలో తరలిస్తున్న కరెన్సీని పోలీసులు పట్టుకున్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
లావుగా ఉన్నాడని కొడుకుతో బలవంతంగా ట్రెడ్మిల్.. ఆరేళ్ల బాలుడి మృతి
-
మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల వీరంగం
-
అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేల్స్ షురూ.. స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు ఇవిగో..