Hyderabad: ఉత్సాహంగా ‘రన్ ఫర్ గర్ల్ చైల్డ్’
బాలికల సాధికారత కోసం సేవా భారతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రన్ ఫర్ గర్ల్ చైల్డ్’ ఉత్సాహంగా సాగింది.
హైదరాబాద్: బాలికల సాధికారత కోసం సేవా భారతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రన్ ఫర్ గర్ల్ చైల్డ్’ ఉత్సాహంగా సాగింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జెండా ఊపి దీన్ని ప్రారంభించారు. ఆడపిల్లల చదువుకు విరాళాల సేకరణ కోసం ఈ కార్యక్రమం చేపట్టారు. ఐటీ ఉద్యోగులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గచ్చిబౌలి స్టేడియం నుంచి రన్ ప్రారంభమైంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీదుగా తిరిగి స్టేడియానికి చేరుకుంది.
తక్కువ ఆదాయ ప్రాంతాలలో నివసించే బాలికలకు విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న సంస్థ ప్రతినిధులను గవర్నర్ అభినందించారు. ప్రస్తుతం హైదరాబాద్లో 6700 మంది లబ్ధిదారులతో 300 కిషోరి వికాస్ కేంద్రాలు పని చేస్తున్నాయని సేవా భారతి ప్రతినిధులు తెలిపారు. ఈ రన్ ద్వారా మరో 500 కేంద్రాలను విస్తరించి లబ్ధిదారులను 10వేలకు చేర్చడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
-
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్పై మోదీ ధ్వజం
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
-
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!