Vijayawada: సీఎం జగన్‌పై గులకరాయి .. నిందితుడు సతీష్‌కు బెయిల్‌ మంజూరు

సీఎం జగన్‌పై గులకరాయి దాడి కేసులో నిందితుడు సతీశ్‌కు బెయిల్‌ మంజూరైంది.

Updated : 28 May 2024 18:52 IST

విజయవాడ: సీఎం జగన్‌పై గులకరాయి దాడి కేసులో నిందితుడు సతీశ్‌కు బెయిల్‌ మంజూరైంది. నిందితుడికి విజయవాడ కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. శని, ఆదివారాల్లో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సంతకం చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం సతీశ్‌ నెల్లూరు జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని