Hyderabad: పార్కుల్లో అనైతిక చర్యలు.. పలు జంటలకు ఫైన్‌, కౌన్సిలింగ్‌

బహిరంగ ప్రదేశాలు, పార్కుల్లో అనైతిక చర్యలకు పాల్పడే జంటలపై షీ టీమ్స్‌ దృష్టి సారించాయి.

Published : 24 Feb 2024 02:04 IST

హైదరాబాద్‌: బహిరంగ ప్రదేశాలు, పార్కుల్లో అనైతిక చర్యలకు పాల్పడే జంటలపై షీ టీమ్స్‌ దృష్టి సారించాయి. నెక్లెస్‌రోడ్, ఇందిరా పార్క్‌, కృష్ణకాంత్‌పార్క్‌తోపాటు ఇతర పబ్లిక్‌ ప్లేస్‌లలో సామాన్యులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించిన జంటలను శుక్రవారం షీ టీమ్స్‌ అదుపులోకి తీసుకున్నాయి. 12 మందిని అదుపులోకి తీసుకొని ఫైన్‌ వేసి, కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపించారు. బహిరంగ ప్రదేశాల్లో సామాన్యులకు ఇబ్బందులు కలిగేలా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. నెక్లెస్‌రోడ్‌తో పాటు ఇతర పార్కుల్లో షీ టీమ్స్‌ నిఘా ఉంటుందని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని