Shopping mall: ఇది పేదల షాపింగ్మాల్.. ₹1కే దుస్తులు!
నిరుపేదలకు సాయం చేయాలన్న తపన చాలా మందికి ఉంటుంది. ఈ క్రమంలో ట్రస్టులకు విరాళం ఇస్తుంటారు. వ్యక్తిగతంగా ఆర్థిక సాయం చేస్తుంటారు. ఈ కాలం యువత వినూత్న పద్ధతుల్లో పేదలకు సాయం చేస్తుండటం చూస్తూనే ఉన్నాం. ఆ మధ్య వాల్ ఆఫ్ కైండ్నెస్ పేరుతో పేదలకు దుస్తులు అందజేసే
ఇంటర్నెట్ డెస్క్: నిరుపేదలకు సాయం చేయాలన్న తపన చాలా మందికి ఉంటుంది. ఈ క్రమంలో ట్రస్టులకు విరాళం ఇస్తుంటారు. వ్యక్తిగతంగా ఆర్థిక సాయం చేస్తుంటారు. ఈ కాలం యువత వినూత్న పద్ధతుల్లో పేదలకు సాయం చేస్తుండటం చూస్తూనే ఉన్నాం. గతంలో వాల్ ఆఫ్ కైండ్నెస్ పేరుతో పేదలకు దుస్తులు అందజేసే కార్యక్రమాన్ని కొందరు ప్రారంభించారు. ఓ చోటును ఎంచుకొని దుస్తులను అక్కడ పెడితే.. పేదలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం అప్పట్లో ప్రశంసలు అందుకుంది. అయితే.. నిర్వహణ సరిగా లేక.. దుస్తులు పాడైపోతున్నాయి. అయితే, ఇటీవల బెంగళూరుకు చెందిన నలుగురు స్నేహితులకు కరోనా సమయంలో ఆర్థికంగా చితికిపోయిన పేదలకు దుస్తులు అందజేయాలన్న ఆలోచన వచ్చింది. వాల్ ఆఫ్ కైండ్నెస్లా కాకుండా మరింత కొత్తగా, భిన్నంగా ఆలోచించి.. ప్రజల నుంచి సేకరించిన దుస్తులతో పేదల కోసం ఏకంగా షాపింగ్మాల్నే ప్రారంభించారు. అయితే, ఈ దుస్తులు ఉచితంగా ఇవ్వరు. ఏ దుస్తులకైనా ఒక్క రూపాయి చెల్లించాల్సి ఉంటుంది.
బెంగళూరుకు చెందిన మెలిషా నోరోన్హా.. ఆమె భర్త వినోద్.. నితిన్, విఘ్నేశ్ మంచి స్నేహితులు. వీరంతా కలిసి బెరటెనా అగ్రహారంలోని లవకుశ లేఅవుట్లో ‘ఇమాజిన్ క్లాత్ బ్యాంక్’ పేరుతో నిరుపేదల కోసం షాపింగ్మాల్ను ప్రారంభించారు. వారు ఉంటున్న కాలనీ పరిసర ప్రాంతాల ప్రజల నుంచి దుస్తులను విరాళంగా తీసుకొని వాటిని శుభ్రం చేసి షాపింగ్మాల్లో విక్రయిస్తున్నారు. కేవలం ఆదివారాల్లో మాత్రమే తెరుచుకునే ఈ షాపింగ్మాల్లో పురుషులకు, మహిళలకు, పిల్లలకు, అన్ని వయసుల వారికి.. అన్ని రకాల దుస్తులు లభిస్తాయి. ఏ దుస్తులకైనా కేవలం రూ.1 మాత్రమే తీసుకుంటారు. దీంతో పేదలకు కూడా నచ్చిన దుస్తులను ఎంపిక చేసుకొనే అవకాశం లభిస్తుందని షాపింగ్మాల్ నిర్వాహకులు అంటున్నారు.
కళాశాలలో చదువుతున్న సమయంలో అంటే 2002లో వినోద్, విఘ్నేశ్లు కలిసి దాతల నుంచి సేకరించిన దుస్తులతో పేదల కోసం చిన్న షాప్ పెట్టారట. 2013లో ‘ఇమాజిన్’ పేరుతో ట్రస్ట్ను కూడా నెలకొల్పారు. అయితే, కరోనా సమయంలో పేదల ఆర్థిక స్థోమత మరింత దిగజారి.. దుస్తులు కొనుగోలు చేసే పరిస్థితులు లేకపోవడం చూసి షాప్ను పునఃప్రారంభించాలని భావించారు. అలా గత సెప్టెంబర్లో ఈ షాపింగ్మాల్ను ప్రారంభించారు. ఇప్పటి వరకు 150కిపైగా పేద కుటుంబాలు వచ్చి దుస్తులు కొనుగోలు చేశాయని నిర్వాహకులు చెప్పారు. ఒక వ్యక్తి ఒక్కసారి గరిష్ఠంగా పది దుస్తులను మాత్రమే కొనుగోలు చేయాలన్న నిబంధన విధించారు. ఈ సేవ ఇలాగే కొనసాగించాలంటే.. దాతలు ముందుకురావాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
Nellore: నెల్లూరు జిల్లాలో వైకాపా కోటకు బీటలు.. పార్టీకి దూరమవుతున్న ఇద్దరు ఎమ్మెల్యేలు
-
India News
Asaram Bapu: అత్యాచారం కేసులో.. ఆశారాంకు మరోసారి జీవితఖైదు
-
General News
CRPF Jobs: సీఆర్పీఎఫ్లో ఏఎస్సై, హెడ్కానిస్టేబుల్ పోస్టులు.. దరఖాస్తుకు నేడే తుది గడువు
-
Crime News
Bribe: రూ.2.25 లక్షల లంచం తీసుకుంటూ.. అనిశాకు చిక్కిన అధికారి
-
Movies News
Social Look: క్యాప్షన్ కోరిన దీపికా పదుకొణె.. హాయ్ చెప్పిన ఈషా!