సింగపూర్ ఎయిర్లైన్స్: ఇంటికే విమాన భోజనం
కరోనా.. లాక్డౌన్ కారణంగా విమానయాన సేవలు గత కొన్ని నెలలుగా నిలిచిపోయాయి. ప్రయాణికులు లేక, ఆదాయం రాక అనేక విమానయాన సంస్థలు డీలాపడ్డాయి. అయితే సింగపూర్ ఎయిర్లైన్స్ ఈ సమస్యలను అధిగమించడం కోసం మూడు
ఇంటర్నెట్ డెస్క్: కరోనా.. లాక్డౌన్ కారణంగా విమానయాన సేవలు గత కొన్ని నెలలుగా నిలిచిపోయాయి. ప్రయాణికులు లేక, ఆదాయం రాక అనేక విమానయాన సంస్థలు డీలాపడ్డాయి. అయితే సింగపూర్ ఎయిర్లైన్స్ ఈ సమస్యలను అధిగమించడం కోసం మూడు వినూత్న సేవలను తీసుకొస్తోంది.
తరచూ విమానాల్లో ప్రయాణించే వారికి విమానంలో లభించే భోజనం మిస్ అయిన ఫీలింగ్ కలుగుతోందట. దీనిని గమనించిన సింగపూర్ ఎయిర్లైన్స్ విమానంలో అందించే భోజనాన్ని హోం డెలివరీ చేస్తామని ప్రకటించింది. అక్టోబర్ 4న అర్ధరాత్రి ఈ సేవలు ప్రారంభించగా.. మరుసటి రోజు మధ్యాహ్నం వరకు 50కిపైగా ఆర్డర్స్ వచ్చాయట. విమానంలో అందించే బిజినెస్ క్లాస్ భోజనం ధర 288 యూఎస్ డాలర్లు(రూ. 21వేలు), ఫస్ట్క్లాస్ భోజనం ధర 488 యూఎస్ డాలర్లు(రూ.35 వేలు) ఉంటుంది. జీఎస్టీ అదనం. ఈ భోజనంతోపాటు వైన్ బాటిల్ కూడా ఇస్తారట.
దీంతోపాటు మరో రెండు వినూత్న సేవలను సింగపూర్ ఎయిర్లైన్స్ అందుబాటులోకి తేనుంది. చాంగి విమానాశ్రయంలో నిలిపి ఉంచిన ఏ-380 జంబో జెట్ విమానంలో తాత్కాలిక రెస్టారెంట్ ఏర్పాటు చేస్తోంది. అక్టోబర్ 24, 25 తేదీల్లో ఈ రెస్టారెంట్ను తెరవనున్నారు. ఈ విమాన రెస్టారెంట్లో భోజనం చేయాలనుకుంటే అక్టోబర్ 12 నుంచి రిజర్వేషన్ బుక్ చేసుకోవచ్చట. మరోవైపు విమానంలో సిబ్బందికి ఇచ్చే శిక్షణను ప్రజలకు కూడా ఇవ్వనున్నట్లు సింగపూర్ ఎయిర్లైన్స్ వెల్లడించింది. నవంబర్ 21, 22, 28, 29 తేదీల్లో శిక్షణ కార్యక్రమాలు ఉంటాయట. చిన్నారులకు 16.06డాలర్లు, పెద్దలకు 32.10డాలర్లు ఫీజు ఉంటుందని పేర్కొంది. ఈ శిక్షణకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు నవంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే? -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్