AP Election Violence: ఏపీలో ఎన్నికల హింస ఘటనలపై పూర్తి నివేదిక సమర్పించిన సిట్
ఏపీలో ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలపై పూర్తి నివేదికను డీజీపీ కార్యాలయానికి సిట్ సమర్పించింది.
అమరావతి: ఏపీలో ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలపై పూర్తి నివేదికను సిట్ డీజీపీ కార్యాలయానికి సమర్పించింది. ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో 11 మంది అధికారులతో సిట్ను ఎన్నికల సంఘం నియమించిన విషయం తెలిసిందే. 264 పేజీలతో రెండు భాగాలుగా సిట్ నివేదికను రూపొందించింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో జరిగిన పలు హింసాత్మక ఘటనలపై 37 కేసులు నమోదు చేసినట్లు సిట్ తన నివేదికలో వెల్లడించింది. ఆరు కేసుల్లో ఛార్జిషీట్లు దాఖలు చేసినట్లు, ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసులు రెండు ఉన్నట్లు పేర్కొంది. పల్నాడు జిల్లాలో పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేపట్టలేదని అభిప్రాయపడింది.
నిందితుల్ని ప్రశ్నించకపోవడం, సరైన సెక్షన్లు కూడా నమోదు చేయలేదంది. నిందితుల్ని ఎఫ్ఐఆర్లో ఆగంతుకులుగా నమోదు చేయడంపై సిట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. నిందితులు ఎవరో తెలిసినా అరెస్టు చేయకపోవడాన్ని నివేదికలో పేర్కొంది. నిందితులకు శిక్ష పడేవరకు ఎస్పీలు, డీఐజీలు పర్యవేక్షించాలని సూచించింది. కొన్ని ఘటనల్లో ఆధారాలను పోలీసులు సేకరించలేకపోయారంది. మాచర్లలో ఈవీఎం ధ్వంసం కేసులో బీఎల్వో ఆలస్యంగా ఫిర్యాదు చేశారని, ప్రిసైడింగ్ అధికారి అసలు ఫిర్యాదు చేయలేకపోవడాన్ని సిట్ ప్రశ్నించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
గోదావరిలో నిన్నంతా హెచ్చుతగ్గులతో కొనసాగిన భారీ వరద శనివారం ఉదయం నుంచి పెరుగుతోంది. -
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవోగా వెంకయ్య చౌదరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. -
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
ముఖ్యమంత్రి ఆదేశాలతో డ్రగ్స్ నియంత్రణకు ఎక్సైజ్ శాఖ తీవ్రంగా కృషి చేస్తోందని అబ్కారీ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్రెడ్డి తెలిపారు. -
భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు 52.1 అడుగుకు చేరుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ను పెంచుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. -
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
నీతి ఆయోగ్ సమావేశం రాష్ట్రపతి భవన్లో ప్రారంభమైంది. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించనున్నారు. -
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
మదనల్లె సబ్కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసుపై విచారణ కొనసాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో ఆరో రోజు విచారణ చేపట్టారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత