నిద్రలేమి.. ఎన్ని రోజులకు ఏమవుతుందో తెలుసా?
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం 8 గంటల నిద్ర ఉండాలి. కానీ, ఉద్యోగం.. పనులు.. మానసిక ఇబ్బందుల వల్ల కొంతమందికి నిద్ర సరిగా ఉండదు. ఈ మధ్య యువత రాత్రుళ్లు సినిమాలు, వెబ్సిరీస్లు చూసుకుంటూ నిద్ర పాడుచేసుకుంటున్నారు. ఇలా నిద్రలేమితో జీవితాన్ని కొనసాగిస్తే
ఇంటర్నెట్డెస్క్: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం 8 గంటల నిద్ర ఉండాలి. కానీ, ఉద్యోగం.. పనులు.. మానసిక ఇబ్బందుల వల్ల కొంతమందికి నిద్ర సరిగా ఉండదు. ఈ మధ్య యువత రాత్రుళ్లు సినిమాలు, వెబ్సిరీస్లు చూసుకుంటూ నిద్ర పాడుచేసుకుంటున్నారు. ఇలా నిద్రలేమితో జీవితాన్ని కొనసాగిస్తే కొన్ని రోజుల్లోనే ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తుందని వైద్య నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు. అయితే తాజాగా ఒట్టి అనే మ్యాట్రసెస్ సంస్థ.. మెడిసిన్ డైరెక్ట్ అనే సంస్థతో కలిసి ఓ పరిశోధన నిర్వహించింది. నిద్రలేమితో ఉంటే శరీరంలో ఎన్ని రోజులకు ఎలాంటి మార్పులు కనిపిస్తాయో వెల్లడిస్తూ ఓ నివేదిక రూపొందించింది. అందులో ఏముందంటే..
24 గంటల తర్వాత..
24 గంటలకు మించి నిద్రలేమితో ఉన్నవారికి కాస్త మగతగా అనిపిస్తుందట. మెదడు పనితీరు మందగించడంతోపాటు ఏకాగ్రత దెబ్బతింటుంది. చిన్న విషయానికి కూడా చిరాకు పడుతుంటారు. మానసిక స్థితి స్థిరంగా ఉండదు. కళ్లు ఉబ్బినట్లుగా కనిపిస్తాయి. శరీరంలో నాడీవ్యవస్థలో సమతుల్యం దెబ్బతింటుంది. కండరాల నొప్పి మొదలవుతుంది. అప్పుడప్పుడు పని ఒత్తిళ్లతో రాత్రుళ్లు నిద్రపోని వారికి ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయట.
మూడు రోజులు
మూడురోజులకు మించి నిద్రలేమితో ఉంటే.. అలాంటివారిలో మెదడు తీవ్ర ఒత్తిడికి లోనై భ్రాంతులకు గురవుతుంది. దిగాలుగా ఉండటం, మతి స్థిమితంగా లేకపోవడం, జ్ఞానేంద్రియాలపై నియంత్రణ కోల్పోతున్నట్లుగా అనిపిస్తుంటుంది. చర్మం పాలిపోవడం, చూపు మందగించడంతోపాటు కళ్ల నొప్పులు వస్తాయి. కండరాలు సంకోచించినట్లుగా అనిపిస్తుందని వైద్య నిపుణులు తెలిపారు.
వారం రోజులు
నిద్రలేమి వారానికి మించిందంటే మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుందట. నిద్రలేమితో మనిషి ఏదో కోల్పోతున్న భావనలోకి వెళ్లిపోతారు. శరీరంలో తేమశాతం తగ్గి.. చర్మం పొడిబారిపోతుందని ఆ తర్వాత ముడతలు కూడా మొదలవుతాయి. శరీరంలో పీహెచ్ సమతుల్యం కూడా దెబ్బతింటుందని నిపుణులు పేర్కొన్నారు.
నెల దాటితే..
నిద్ర సరిగా లేకుండా నెలరోజులు గడిపితే మనిషి మానసిక స్థితి పూర్తిగా దెబ్బతింటుంది. తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. కొన్ని సందర్భాల్లో భయాందోళనతో వణికిపోతారు. భ్రాంతులు కొనసాగుతాయి. ఏది నిజమో.. ఏది భ్రాంతో తేల్చుకోలేని స్థితికి చేరుకుంటారు. వారి మెదడులో వారికి తెలియకుండానే ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి. చమటలు పట్టడం, తొందరగా బరువు తగ్గడం, మహిళల్లో అయితే హార్మోన్లలో సమతుల్యం దెబ్బతినడం.. కొన్ని సందర్భాల్లో ఆకస్మాత్తుగా మోనోపాజ్ స్థితికి చేరడం వంటివి జరుగుతాయని ఒట్టి, మెడిసిన్ డైరెక్ట్ సంస్థలు నిర్వహించిన పరిశోధనలో తేలింది. కాబట్టి.. నిద్రలేమితో వచ్చే ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని.. నిద్రకు తగినంత సమయం కేటాయించాలని సంస్థలు సూచిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్