Padmavati Express: సికింద్రాబాద్‌- తిరుపతి పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు

సికింద్రాబాద్‌-తిరుపతి పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ రైలులో పొగలు వ్యాపించాయి.

Updated : 29 Mar 2024 22:34 IST

కాజీపేట: సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి వెళ్తోన్న పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ బీ 4 కోచ్‌లో పొగలు వచ్చాయి. దీంతో కాజీపేటలో గంటన్నర పాటు రైలును నిలిపివేశారు. సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరిన రైలు..స్టేషన్‌ ఘన్‌పూర్‌ దాటిన తర్వాత పొగలు రావడం ప్రయాణికులు గమనించారు. సిబ్బందికి సమాచారమందించడంతో రైలును నెమ్మదిగా కాజీపేటకు తీసుకొచ్చారు. బ్యాటరీ క్యాప్‌ లీక్‌ కావడంతో పొగలు వ్యాపించినట్టు గుర్తించి మరమ్మతులు చేశారు. అనంతరం కాజీపేట నుంచి రాత్రి 10 గంటలకు రైలు బయలుదేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు