గల్వాన్ లోయలో సైనికులకు సోలార్ టెంట్లు
భారత్.. చైనా మధ్య యుద్ధవాతావరణానికి కేంద్రబిందువుగా మారిన ప్రాంతం గల్వాన్ లోయ. గత కొన్ని నెలలుగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎప్పటికప్పుడు చైనా బలగాల దురాక్రమణలను తిప్పికొడుతూ.. గల్వాన్లోయలో భారత సైన్యం అహర్నిశలు పహారా కాస్తోంది. ఈ క్రమంలో శత్రువులతోనే
రూపొందించిన ‘త్రీ ఇడియట్స్’ స్ఫూర్తిప్రదాత
ఇంటర్నెట్ డెస్క్: భారత్.. చైనా మధ్య యుద్ధవాతావరణానికి కేంద్రబిందువుగా మారిన ప్రాంతం గల్వాన్ లోయ. గత కొన్ని నెలలుగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎప్పటికప్పుడు చైనా బలగాల దురాక్రమణలను తిప్పికొడుతూ.. గల్వాన్ లోయలో భారత సైన్యం పహారా కాస్తోంది. ఈ క్రమంలో శత్రువులతోనే కాదు.. అక్కడి వాతావరణంతోనూ సైనికులు నిత్యం పోరాటం చేస్తున్నారు. ఆ ప్రాంతంలో శీతాకాలం మైనస్ 20 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత ఉంటుంది. అయినా గడ్డకట్టే చలిలో సైనికులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వారి కోసం వెచ్చటి టెంట్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, వాటికంటే అత్యాధునిక సోలార్ టెంట్లను సైనికుల కోసం రూపొందించారు సోనమ్ వాంగ్చుక్.
సోనమ్ వాంగ్చుక్ ఎవరో కాదు.. త్రీ ఇడియట్స్ చిత్రంలో ఆమిర్ ఖాన్ పోషించిన ఫున్సుక్ వాంగ్డు పాత్ర ఆయనదే. ఎన్నో వస్తువులను కనిపెట్టి పేటెంట్ పొందారు. భారతదేశం గర్వించదగ్గ ఇంజినీర్.. శాస్త్రవేత్త. తాజాగా ఆయన గల్వాన్ లోయలో సేవలందిస్తున్న భారత సైనికుల కోసం సోలార్ టెంట్లను రూపొందించారు. బయట ఉష్ణోగ్రత ఎంత మైనస్ డిగ్రీల్లో ఉన్నా.. ఈ టెంట్లలో మాత్రం 15 నుంచి 20 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని సోనమ్ వెల్లడించారు. ఒక్కో టెంట్లో పది మంది సైనికులు ఉండొచ్చు. ఒక్క టెంట్ బరువు 30 కిలోల కన్నా తక్కువే ఉంటుందట. దీన్ని మడతబెట్టి ఎక్కడికైనా తీసుకెళ్లే విధంగా తయారు చేశారు. ఈ టెంట్లలో ఉంటే సైనికులు బయట చలిమంట కాల్చుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే కిరోసిన్ వాడరు.. కాలుష్యం వెలువడదు అని సోనమ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తాను తయారు చేసిన ఈ టెంట్ల ఫొటోలను ట్విటర్ వేదికగా పంచుకున్నారు. మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ లద్దాఖ్, కార్బన్ న్యూట్రల్ హ్యాష్ ట్యాగ్లు ఇచ్చారు. సోనమ్ ఆవిష్కరణ చూసిన నెటిజన్లు ‘జహాపనా తుసీ గ్రేట్ హో’అంటూ ఆయన్ను ప్రశంసిస్తున్నారు. సైనికుల చలి సమస్యకు మంచి పరిష్కారం కనిపెట్టారని అభినందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
-
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
-
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి
-
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?