గల్వాన్ లోయలో సైనికులకు సోలార్ టెంట్లు
భారత్.. చైనా మధ్య యుద్ధవాతావరణానికి కేంద్రబిందువుగా మారిన ప్రాంతం గల్వాన్ లోయ. గత కొన్ని నెలలుగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎప్పటికప్పుడు చైనా బలగాల దురాక్రమణలను తిప్పికొడుతూ.. గల్వాన్లోయలో భారత సైన్యం అహర్నిశలు పహారా కాస్తోంది. ఈ క్రమంలో శత్రువులతోనే
రూపొందించిన ‘త్రీ ఇడియట్స్’ స్ఫూర్తిప్రదాత
ఇంటర్నెట్ డెస్క్: భారత్.. చైనా మధ్య యుద్ధవాతావరణానికి కేంద్రబిందువుగా మారిన ప్రాంతం గల్వాన్ లోయ. గత కొన్ని నెలలుగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎప్పటికప్పుడు చైనా బలగాల దురాక్రమణలను తిప్పికొడుతూ.. గల్వాన్ లోయలో భారత సైన్యం పహారా కాస్తోంది. ఈ క్రమంలో శత్రువులతోనే కాదు.. అక్కడి వాతావరణంతోనూ సైనికులు నిత్యం పోరాటం చేస్తున్నారు. ఆ ప్రాంతంలో శీతాకాలం మైనస్ 20 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత ఉంటుంది. అయినా గడ్డకట్టే చలిలో సైనికులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వారి కోసం వెచ్చటి టెంట్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, వాటికంటే అత్యాధునిక సోలార్ టెంట్లను సైనికుల కోసం రూపొందించారు సోనమ్ వాంగ్చుక్.
సోనమ్ వాంగ్చుక్ ఎవరో కాదు.. త్రీ ఇడియట్స్ చిత్రంలో ఆమిర్ ఖాన్ పోషించిన ఫున్సుక్ వాంగ్డు పాత్ర ఆయనదే. ఎన్నో వస్తువులను కనిపెట్టి పేటెంట్ పొందారు. భారతదేశం గర్వించదగ్గ ఇంజినీర్.. శాస్త్రవేత్త. తాజాగా ఆయన గల్వాన్ లోయలో సేవలందిస్తున్న భారత సైనికుల కోసం సోలార్ టెంట్లను రూపొందించారు. బయట ఉష్ణోగ్రత ఎంత మైనస్ డిగ్రీల్లో ఉన్నా.. ఈ టెంట్లలో మాత్రం 15 నుంచి 20 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని సోనమ్ వెల్లడించారు. ఒక్కో టెంట్లో పది మంది సైనికులు ఉండొచ్చు. ఒక్క టెంట్ బరువు 30 కిలోల కన్నా తక్కువే ఉంటుందట. దీన్ని మడతబెట్టి ఎక్కడికైనా తీసుకెళ్లే విధంగా తయారు చేశారు. ఈ టెంట్లలో ఉంటే సైనికులు బయట చలిమంట కాల్చుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే కిరోసిన్ వాడరు.. కాలుష్యం వెలువడదు అని సోనమ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తాను తయారు చేసిన ఈ టెంట్ల ఫొటోలను ట్విటర్ వేదికగా పంచుకున్నారు. మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ లద్దాఖ్, కార్బన్ న్యూట్రల్ హ్యాష్ ట్యాగ్లు ఇచ్చారు. సోనమ్ ఆవిష్కరణ చూసిన నెటిజన్లు ‘జహాపనా తుసీ గ్రేట్ హో’అంటూ ఆయన్ను ప్రశంసిస్తున్నారు. సైనికుల చలి సమస్యకు మంచి పరిష్కారం కనిపెట్టారని అభినందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
వంద మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మరో రికార్డును సాధించింది. -
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
గోదావరిలో నిన్నంతా హెచ్చుతగ్గులతో కొనసాగిన భారీ వరద శనివారం ఉదయం నుంచి పెరుగుతోంది. -
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవోగా వెంకయ్య చౌదరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. -
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
ముఖ్యమంత్రి ఆదేశాలతో డ్రగ్స్ నియంత్రణకు ఎక్సైజ్ శాఖ తీవ్రంగా కృషి చేస్తోందని అబ్కారీ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్రెడ్డి తెలిపారు. -
భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు 52.1 అడుగుకు చేరుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ను పెంచుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. -
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
నీతి ఆయోగ్ సమావేశం రాష్ట్రపతి భవన్లో ప్రారంభమైంది. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించనున్నారు. -
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
మదనల్లె సబ్కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసుపై విచారణ కొనసాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో ఆరో రోజు విచారణ చేపట్టారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్లో.. బిల్ గేట్స్ అల్లుడి పోటీ
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు