Hyderabad: శంషాబాద్‌ నుంచి దిల్లీ వెళ్లాల్సిన విమానం రద్దు.. ప్రయాణికుల ఆందోళన

హైదరాబాద్ నుంచి దిల్లీ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానంలో బుధవారం ఉదయం సాంకేతిక లోపం ఏర్పడింది.

Updated : 29 Nov 2023 11:43 IST

శంషాబాద్: హైదరాబాద్ నుంచి దిల్లీ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానంలో బుధవారం ఉదయం సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో విమాన సర్వీసును అధికారులు రద్దు చేశారు. విమానాన్ని అర్ధంతరంగా రద్దు చేయడంతో 160 మంది ప్రయాణికులు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఆందోళనకు దిగారు. ఆలస్యంగా స్పందించిన ఎయిర్ లైన్స్ ప్రతినిధులు బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు మరో విమానంలో పంపించేందుకు ఏర్పాట్లు చేశామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దు మణిగింది. ప్రయాణాన్ని రద్దు చేసుకున్న ప్రయాణికులకు పూర్తి స్థాయిలో టికెట్ డబ్బును వెనక్కి ఇవ్వనున్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని