Palnadu: పల్నాడు కలెక్టర్, మూడు జిల్లాలకు ఎస్పీలను నియమించిన ఈసీ
పల్నాడు జిల్లా కలెక్టర్గా లట్కర్ శ్రీకేశ్ బాలాజీని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
అమరావతి: పల్నాడు జిల్లా కలెక్టర్గా లట్కర్ శ్రీకేశ్ బాలాజీతో పాటు మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పల్నాడు ఎస్పీగా మల్లికా గార్గ్, తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్, అనంతపురం ఎస్పీగా గౌతమి సాలిని నియమించింది.
ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత చెలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీతో భేటీ తర్వాత అసహనం వ్యక్తం చేస్తూ మూడు జిల్లాలకు చెందిన కీలక ఉన్నతాధికారులపై కొరడా ఝుళిపించింది. పల్నాడు, అనంతపురం జిల్లా ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ.. ఇద్దరినీ వెంటనే విధుల్లోంచి తప్పించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్, డీజీపీలను ఆదేశించింది. అలాగే, పల్నాడు జిల్లా కలెక్టర్, తిరుపతి ఎస్పీలను బదిలీ చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలకు ఆదేశించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటర్ విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
పాస్ పుస్తకాలు, ధ్రువీకరణ పత్రాలపై ఫొటోలు, రాజకీయ రంగులు ఉండొద్దు
గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో ధ్రువీకరణ పత్రాల జారీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ పీఆర్సీ ఛైర్మన్ మన్మోహన్సింగ్ రాజీనామా
ఉద్యోగుల వేతన సవరణకు నియమించిన 12వ పీఆర్సీ ఛైర్మన్, విశ్రాంత ఐఏఎస్ అధికారి మన్మోహన్సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. -
మంత్రులకు ఛాంబర్ల కేటాయింపు.. సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు
డిప్యూటీ సీఎం, మంత్రులకు ఛాంబర్లను కేటాయిస్తూ సాధారణ పరిపాలనశాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. -
ఏపీ అడ్వకేట్ జనరల్గా దమ్మాలపాటి శ్రీనివాస్
ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్గా దమ్మాలపాటి శ్రీనివాస్ నియమితులయ్యారు. -
ఏపీలో సంక్షేమ పథకాలకు మళ్లీ ఒకప్పటి పేర్లు
ఆంధ్రప్రదేశ్లో పలు సంక్షేమ పథకాల పేర్లను మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్వర్వులు వెలువరించింది. -
ఠారెత్తిస్తున్న టమాటా ధర.. రైతు బజార్ల ద్వారా విక్రయించాలని మార్కెటింగ్శాఖ నిర్ణయం
రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన టమాటా ధరలపై మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు మంగళవారం సమీక్ష నిర్వహించారు. -
రెండు రియల్ ఎస్టేట్ కంపెనీలకు ‘రెరా’ షోకాజ్ నోటీసులు
సోనెస్టా ఇన్ఫినిటి, హస్తిన రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు షోకాజ్ నోటీసులు జారీచేసినట్లు ‘రెరా’ అథారిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గత ప్రభుత్వ తప్పిదాలపై క్రిమినల్ చర్యలకూ వెనుకాడొద్దు: కోదండరాం
భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ప్లాంట్లు, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ కొనసాగుతోంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విజయవాడలో క్యాంపు కార్యాలయం.. పరిశీలించిన పవన్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ (Pawan Kalyan) కోసం విజయవాడలో క్యాంపు కార్యాలయం సిద్ధమవుతోంది. మంగళవారం ఆయన పరిశీలించి అంగీకారం తెలిపారు -
నీట్ ప్రశ్నపత్రం లీకేజ్కు నిరసనగా భారాస ఆందోళన
నీట్ ప్రశ్నపత్రం లీకేజ్కు నిరసనగా భారాస ఆందోళన చేపట్టింది. -
యాదాద్రి క్షేత్రంలో వైభవంగా ‘గిరి ప్రదక్షిణ’
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో ‘గిరి ప్రదక్షిణ’ వైభవంగా జరిగింది. స్వామి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా మంగళవారం ఉదయం నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
గన్నవరం ఎయిర్పోర్టులో డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్కు ఘన స్వాగతం
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడకు చేరుకున్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
అందినకాడికి దండుకో..
ఇది కేవలం ఒక పాఠశాలకు సంబంధించిన అంశం కాదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో దుస్తులు, పుస్తకాలు, ట్యూషన్, బస్సు ఫీజులు, బూట్లు తదితరాల ధరలు అమాంతం పెంచేసి అందినకాడికి దండుకుంటున్నారు. -
పిల్లలకు హెల్దీ లంచ్బాక్స్.. ఇలా చేస్తే ఇష్టంగా తినేస్తారు!
పాఠశాలలు మొదలయ్యాయి. బడికి వెళ్లే పిల్లలకు లంచ్బాక్స్ ఏం పెట్టాలనే విషయంలో అయోమయానికి గురికాకుండా కొన్ని టిప్స్, సూచనలు మీకోసం.. -
రేణుకాస్వామి కేసులో కొత్త మలుపులెన్నెన్నో
చిత్రదుర్గ నివాసి రేణుకాస్వామి హత్య కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. ఈకేసులో సినీనటుడు దర్శన్ ఇప్పటికే పోలీస్ కస్టడీలో విచారణ ఎదుర్కొంటుండగా.. నటి పవిత్రాగౌడ మేనేజరు దేవరాజ్ను తాజాగా అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు -
పడేశారా? పడిపోయాయా?
అటవీ శాఖ ఆధ్వర్యంలో కలప తరలింపు వ్యవహారం సోమవారం నాటకీయ పరిణామాల మధ్య సాగింది. తరలించింది, దాన్ని అడ్డుకున్నదీ ఆ శాఖ సిబ్బందే కావటం గమనార్హం.