Andhra news: తెలంగాణ నుంచి రిలీవ్‌.. ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేసిన ఐఏఎస్‌ శ్రీనివాసరాజు

డిప్యూటేషన్‌పై తెలంగాణలో నాలుగేళ్లకు పైగా పనిచేసిన ఐఏఎస్‌ అధికారి శ్రీనివాసరాజు ఆ రాష్ట్రం నుంచి రిలీవ్‌ అయ్యారు.

Published : 31 May 2024 22:15 IST

అమరావతి: డిప్యూటేషన్‌పై తెలంగాణలో నాలుగేళ్లకు పైగా పనిచేసిన ఐఏఎస్‌ అధికారి శ్రీనివాసరాజు ఆ రాష్ట్రం నుంచి రిలీవ్‌ అయ్యారు. శుక్రవారం వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో సీఎస్‌ జవహర్‌రెడ్డిని కలిసి రిపోర్టు చేశారు. తెలంగాణలో రహదారులు భవనాలశాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహించారు. డిప్యూటేషన్‌ ముగియడంతో ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేశారు. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవోగా శ్రీనివాసరాజు సుదీర్ఘకాలం పనిచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని