Viveka murder case: సునీత పిటిషన్.. శివశంకర్రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడు శివశంకర్రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. జులై 22 నుంచి ప్రారంభమయ్యే వారంలో లిస్ట్ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది.
దిల్లీ: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడు శివశంకర్రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. జులై 22 నుంచి ప్రారంభమయ్యే వారంలో లిస్ట్ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. శివశంకర్రెడ్డికి ఇటీవల తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణలో భాగంగా శివశంకర్రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్పై సమాధానం చెప్పాలని కోరింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో శివశంకర్రెడ్డి ఏ5గా ఉన్నారు. ఆయనతో పాటు ప్రతివాదులందరికీ అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ప్రతివాదిగా దర్యాప్తు సంస్థ సీబీఐని కూడా సునీత చేర్చారు.
వాదనల సమయంలో విచారణ ఏ దశలో ఉందని ధర్మాసనం ప్రశ్నించింది. ఛార్జెస్ ఫ్రేమ్ చేసే దశలోనే ఉన్నట్లు సునీత తరఫు న్యాయవాది బదులిచ్చారు. ప్రతి దశలోనూ ట్రయల్ సాగకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలిపారు. ఈ కేసులో ఇతర నిందితులు కూడా బెయిల్ పొందారా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఏ1కు గతంలో బెయిల్ రాగా.. సుప్రీం కోర్టు స్టే ఇచ్చిందని న్యాయవాది తెలిపారు. ఇదే కేసుకు సంబంధించి గతంలో దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరగాల్సి ఉందని చెప్పారు. ఈ నెల మూడో వారంలో ఇదే ధర్మాసనం ముందుకు వస్తుందని చెప్పారు. ఏ8 మాత్రం ముందస్తు బెయిల్పై ఉన్నారని.. దీనిపై ఇప్పటికే సవాల్ చేసినట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్యాంకు ఖాతాల్లో పింఛన్ జమకాని వారికి.. మే 4న ఇస్తాం: శశి భూషణ్
మే నెల పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ.1945 కోట్లు విడుదల చేసిందని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ఫీజు గడువును తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పొడిగించింది. మే 4 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. -
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం: నెట్వర్క్ ఆసుపత్రుల లేఖ
మే 4వ తేదీ నుంచి నగదు రహిత చికిత్సలు నిలుపుదల చేస్తామని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు ప్రభుత్వానికి లేఖ రాశాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల వీరంగం
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరులు వీరంగం సృష్టించారు. -
పింఛను దారులను అష్టకష్టాలు పెడుతున్న జగన్
తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో పింఛన్ కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతవులు గురువారం పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
4 కంటైనర్లలో రూ.2వేల కోట్లు పట్టివేత!
అనంతపురం జిల్లా పామిడి వద్ద నాలుగు కంటైనర్లలో తరలిస్తున్న కరెన్సీని పోలీసులు పట్టుకున్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అదరగొట్టిన హైదరాబాద్.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్పై విజయం
-
బ్యాంకు ఖాతాల్లో పింఛన్ జమకాని వారికి.. మే 4న ఇస్తాం: శశి భూషణ్
-
97.76% రూ.2వేల నోట్లు వెనక్కి: ఆర్బీఐ
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!