Tamilisai: దిల్లీ వెళ్తున్నా.. ఇది రాజకీయ పర్యటన కాదు: గవర్నర్ తమిళిసై

సంక్రాంతి వేడుకల కోసం దిల్లీ వెళ్తున్నానని.. ఇది రాజకీయ పర్యటన కాదని గవర్నర్ తమిళిసై (Tamilisai Soundararajan) తెలిపారు.

Published : 13 Jan 2024 10:26 IST

హైదరాబాద్: సంక్రాంతి వేడుకల కోసం దిల్లీ వెళ్తున్నానని.. ఇది రాజకీయ పర్యటన కాదని గవర్నర్ తమిళిసై (Tamilisai Soundararajan) తెలిపారు. రాజ్‌భవన్‌లో నిర్వహించిన పండగ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సంక్రాంతి పండగను అందరూ సంతోషంగా చేసుకోవాలి. అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ ఈ ఏడాది ప్రత్యేకత. రామ్‌మందిర్‌ పాటను తెలుగు, హిందీలో విడుదల చేస్తున్నాం’’ అని గవర్నర్‌ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని