TG News: తెలంగాణలో 10 వర్సిటీలకు ఇన్‌ఛార్జి వీసీలను నియమించిన ప్రభుత్వం

తెలంగాణలో 10 యూనివర్సిటీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌ఛార్జి వీసీలను నియమించింది.

Updated : 21 May 2024 17:07 IST

హైదరాబాద్‌: తెలంగాణలో 10 యూనివర్సిటీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌ఛార్జి వీసీలను నియమించింది. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను వైస్‌ ఛాన్సలర్‌(వీసీ)లుగా నియమిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. 

కొత్తగా నియమితులైన వీసీలు వీరే...

  • ఉస్మానియా యూనివర్సిటీ- దాన కిషోర్‌
  • జేఎన్‌టీయూ - బుర్రా వెంకటేశం
  • కాకతీయ యూనివర్సిటీ- కరుణ వాకాటి
  • అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీ- రిజ్వీ
  • తెలంగాణ యూనివర్సిటీ- సందీప్‌ సుల్తానియా
  • పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ- శైలజ రామయ్యర్‌
  • మహాత్మాగాంధీ యూనివర్సిటీ- నవీన్‌ మిట్టల్‌
  • శాతవాహన యూనివర్సిటీ- సురేంద్రమోహన్‌
  • పాలమూరు యూనివర్సిటీ- నదీం అహ్మద్‌
  • జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైనాన్స్‌ వర్సిటీ- జయేష్ రంజన్‌
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు