UPSC: 10 మంది తెలంగాణ అధికారులకు ఐఏఎస్ హోదా.. ప్రకటించిన యూపీఎస్సీ
తెలంగాణ రాష్ట్ర సర్వీసుకు చెందిన 10 మంది అధికారులకు యూపీఎస్సీ ఐఏఎస్ హోదా కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఫలితాలు పంపించింది.
దిల్లీ: తెలంగాణ రాష్ట్ర సర్వీసుకు చెందిన 10 మంది అధికారులకు ఐఏఎస్ హోదా లభించింది. రెవెన్యూ, నాన్ రెవెన్యూ కోటాలో ఐదుగురు చొప్పున అధికారులకు ఐఏఎస్ హోదా కల్పించారు. జల్ద అరుణశ్రీ, ఎ.నిర్మల కాంతి వెస్లీ, కోటా శ్రీవాస్తవ, చెక్కా ప్రియాంక, బడుగు చంద్రశేఖర్, కోరం అశోక్ రెడ్డి, హరిత, వెంకట నర్సింహారెడ్డి, కాత్యాయని, నవీన్ నికోలస్లకు యూపీఎస్సీ ఐఏఎస్ హోదా కల్పించింది. రాష్ట్ర అధికారులకు జనవరి నెలలో యూపీఎస్సీ ఇంటర్వ్యూలు నిర్వహించింది. వాటి ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది.
అరుణశ్రీ, నిర్మల కాంతి వెస్లీ, కోటా శ్రీవాస్తవ, చెక్కా ప్రియాంక, బడుగు చంద్రశేఖర్ రెవెన్యూ విభాగం నుంచి ఐఏఎస్ హోదా పొందారు. నాన్ రెవెన్యూ కేటగిరీలో అశోక్ రెడ్డి, హరిత, వెంకటనర్సింహారెడ్డి, కాత్యాయని, నవీన్ నికోలస్కు ఐఏఎస్ హోదా లభించింది. రాష్ట్ర సహకార శాఖకు చెందిన అశోక్ రెడ్డి.. ఆర్థిక మంత్రి హరీశ్రావు వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్నారు. వెంకటనర్సింహా రెడ్డి టీఎస్ఐఐసీ ఎండీగా, వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్గా హరిత విధులు నిర్వర్తిస్తున్నారు. పంచాయతీ రాజ్ శాఖకు చెందిన కాత్యాయని మంత్రి కేటీఆర్ వద్ద ఓఎస్డీగా పనిచేస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖకు చెందిన నవీన్ నికోలస్ కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
నీతి ఆయోగ్ సమావేశం రాష్ట్రపతి భవన్లో ప్రారంభమైంది. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించనున్నారు. -
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
మదనల్లె సబ్కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసుపై విచారణ కొనసాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో ఆరో రోజు విచారణ చేపట్టారు. -
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం మళ్లీ పెరుగుతోంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్