Bharat Ratna: ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటిస్తే తెలుగు ప్రజానీకం పులకించిపోయేది: విజయశాంతి

ఎన్టీఆర్‌కు కూడా భారత రత్న ప్రకటించి ఉంటే తెలుగు ప్రజానీకం పులకించిపోయేదని కాంగ్రెస్‌ నాయకురాలు విజయశాంతి అన్నారు.

Published : 10 Feb 2024 01:59 IST

హైదరాబాద్‌: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు (PV Narasimha Rao) దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న (Bharat Ratna)ప్రకటించడంపై సినీనటి, కాంగ్రెస్‌ నాయకురాలు విజయశాంతి స్పందించారు. తెలుగుజాతి గౌరవానికి ప్రతీకగా నిలిచిన పీవీకి ఇలాంటి గౌరవం దక్కడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు (NTR) కూడా భారతరత్న ప్రకటించి ఉంటే తెలుగుజాతి మరింత పులకించిపోయి ఉండేదన్నారు. ఈ మేరకు ఆమె ‘ఎక్స్‌’(ట్విటర్‌)లో పోస్టు చేశారు. ఈ అంశాన్ని జాతీయస్థాయికి తీసుకెళ్లగలిగే పరిస్థితులు ప్రస్తుతం పుష్కలంగా ఉన్నాయన్నారు. ఈ బాధ్యతను భుజాలకెత్తుకొని, అందరి సంకల్పాన్ని సిద్ధింపజేసే ప్రయత్నం తప్పక జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. రాజకీయ పార్టీలన్నీ ఈ అంశాన్ని బలపరుస్తారని నమ్ముతున్నట్లు ఆమె తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని