Tirupati: తిరుపతి శివారులో గుడిసెల తొలగింపు.. తీవ్ర ఉద్రిక్తత

తిరుపతి నగర శివారులోని రేణిగుంట మండలంలోని కరకంబాడిలో గుడిసెల తొలగింపు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

Published : 27 Feb 2024 10:17 IST

రేణిగుంట: తిరుపతి నగర శివారులోని రేణిగుంట మండలంలోని కరకంబాడిలో గుడిసెల తొలగింపు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కొండ పోరంబోకు స్థలంలో పేదలు వేసుకున్న గుడిసెల తొలగింపునకు రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం 5 జేసీబీలు తీసుకువచ్చారు. స్థానికులు ఆందోళనకు దిగి వారిని అడ్డుకున్నారు. వైకాపా నేతల కబ్జాలను వదిలేసి తమపై దాడి చేస్తారా అంటూ మండిపడ్డారు. దీంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని