AP News: విజయవాడ సీపీ కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత

మాజీ మంత్రి, తెదేపా నేత ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది.

Published : 29 Feb 2024 20:36 IST

విజయవాడ: మాజీ మంత్రి, తెదేపా నేత ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో విజయవాడ సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మొదట శరత్‌ కోసం టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయం వద్ద ఆరా తీసిన ప్రత్తిపాటి.. జాడ చెప్పాలంటూ సీపీ కార్యాలయానికి వచ్చారు. ఆయన వెంట పలువురు తెదేపా నాయకులు ఉన్నారు. కార్యాలయంలోకి వెళ్లడానికి అనుమతించకపోవడంతో పోలీసులు, తెదేపా నాయకుల మధ్య వాగ్వాదం నెలకొంది. అనంతరం ప్రత్తిపాటి పుల్లారావు, గద్దె రామ్మోహన్‌, పట్టాభిరామ్‌, పిల్లి మాణిక్యాలరావును లోపలికి అనుమతించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని