Tg tet: ప్రారంభమైన ‘టెట్‌’ ఎగ్జామ్‌.. పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ

తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ప్రారంభమైంది. అభ్యర్థుల రాకతో వివిధ పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ నెలకొంది.

Updated : 20 May 2024 09:20 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ప్రారంభమైంది. అభ్యర్థుల రాకతో వివిధ పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ నెలకొంది. పరీక్ష నేపథ్యంలో అధికారులు, పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. జూన్‌ 2 వరకు జరిగే ఈ పరీక్ష మొదటి పేపర్‌కు 99,958 మంది, రెండో పేపర్‌కు 1,86,428 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం 9 నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. 80 పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులు టెట్‌ రాయనున్నారు. మేడ్చల్‌లో 25, రంగారెడ్డి జిల్లాలో 17 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని