Cabinet Meeting: తెలంగాణ మంత్రివర్గ భేటీకి ముహూర్తం ఖరారు

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ భేటీకి ముహూర్తం ఖరారైంది. సోమవారం మధ్యాహ్నం 3గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు.

Updated : 19 May 2024 18:49 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ భేటీకి ముహూర్తం ఖరారైంది. సోమవారం మధ్యాహ్నం 3గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. కేబినెట్‌ భేటీకి ఎన్నికల సంఘం(ఈసీ) అనుమతి ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. శనివారమే మంత్రివర్గ భేటీ నిర్వహించాల్సి ఉండగా.. ఈసీ అనుమతి ఇవ్వలేదు. దీంతో సమావేశాన్ని వాయిదా వేశారు. ఆదివారం మధ్యాహ్నం షరతులతో కూడిన అనుమతి లభించింది. జూన్‌ 4లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపై మాత్రమే చర్చించాలని.. రైతు రుణమాఫీ, ఉమ్మడి రాజధాని అంశాలపై చర్చించవద్దని ఈసీ పేర్కొంది. ఈ మేరకు సమావేశం నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని