TG Cabinet: తెలంగాణ మంత్రివర్గం భేటీ ప్రారంభం.. వీటిపైనే చర్చ!

తెలంగాణ మంత్రివర్గం సమావేశమైంది. ఈసీ అనుమతితో సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ సచివాలయంలో మంత్రులు భేటీ అయ్యారు. 

Updated : 20 May 2024 15:48 IST

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రివర్గం సమావేశమైంది. ఈసీ అనుమతితో సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ సచివాలయంలో మంత్రులు భేటీ అయ్యారు. జూన్‌ 4లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపైనే చర్చించాలని ఈసీ షరతు పెట్టిన విషయం తెలిసిందే. దీంతో ధాన్యం కొనుగోళ్లు, విద్యాసంస్థల్లో వసతులు, మేడిగడ్డ బ్యారేజీ, మరికొన్ని అత్యవసర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. రైతు రుణమాఫీ, ఉమ్మడి రాజధాని అంశాలపై చర్చించవద్దని, ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న అధికారులు ఈ భేటీలో పాల్గొనవద్దని ఈసీ షరతు పెట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని