Music Academy: కర్ణాటక సంగీతంలో మూడేళ్ల కోర్సుకు మద్రాస్ మ్యూజిక్ అకాడమీ దరఖాస్తుల ఆహ్వానం
కర్ణాటక సంగీతంలో అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సు కోసం మద్రాస్ మ్యూజిక్ అకాడమీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
చెన్నై: కర్ణాటక సంగీతంలో అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సు కోసం మద్రాస్ మ్యూజిక్ అకాడమీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగినవారు జూన్ 25వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మూడేళ్ల వ్యవధి కలిగిన ఈ కోర్సులో ఏటా రెండు సెమిస్టర్లు ఉంటాయి. తరగతులు జులైలో ప్రారంభించనున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య తరగతులు నిర్వహిస్తారు. ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకొనేందుకు ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్కులు అర్హులు. సంగీతంలోని వర్ణాలు, కృతులు పాడగలగాలి.
ఈ కోర్సు కోసం దరఖాస్తులు మ్యూజిక్ అకాడమీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు సంగీత శిక్షణకు సంబంధించిన వివరాలను ఈ-మెయిల్ చేయాలని అధికారులు పేర్కొన్నారు. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో 2010లో ఏర్పాటైన అడ్వాన్స్డ్ స్కూల్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్ సంస్థ సంగీతంలో విద్యార్థులకు ఉన్నత స్థాయి నైపుణ్యాలు అందించేందుకు శిక్షణ ఇస్తోంది. సంగీతంలో దిగ్గజాల నుంచి నేర్చుకోవడంతో పాటు వేదికలపై ప్రదర్శన ఇవ్వగలిగే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తోంది. మరింత సమాచారం కోసం www.musicacademymadras.in సందర్శించవచ్చు. లేదా 044-28112231/ 28116902/ 28115162 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవోగా వెంకయ్య చౌదరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. -
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
ముఖ్యమంత్రి ఆదేశాలతో డ్రగ్స్ నియంత్రణకు ఎక్సైజ్ శాఖ తీవ్రంగా కృషి చేస్తోందని అబ్కారీ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్రెడ్డి తెలిపారు. -
భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు 52.1 అడుగుకు చేరుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ను పెంచుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. -
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
నీతి ఆయోగ్ సమావేశం రాష్ట్రపతి భవన్లో ప్రారంభమైంది. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించనున్నారు. -
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
మదనల్లె సబ్కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసుపై విచారణ కొనసాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో ఆరో రోజు విచారణ చేపట్టారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు