Kamareddy: తిరుమలలో అదృశ్యమైన ముగ్గురు విద్యార్థుల ఆచూకీ లభ్యం

తిరుమలలో అదృశ్యమైన ముగ్గురు విద్యార్థుల ఆచూకీ తెలంగాణలో లభ్యమైంది. కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో ఈ ముగ్గురి ఆచూకీ లభించింది.

Published : 07 Dec 2023 10:56 IST

కామారెడ్డి: తిరుమలలో అదృశ్యమైన ముగ్గురు విద్యార్థుల ఆచూకీ తెలంగాణలో లభ్యమైంది. కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో ఈ ముగ్గురి ఆచూకీ లభించింది. ప్రస్తుతం వీరిని అదుపులోకి తీసుకున్న స్థానిక పోలీసులు ఠాణాకు తరలించి.. ఏపీ పోలీసులు, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. 

ఏడో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు బుధవారం సాయంత్రం తిరుమలలో అదృశ్యమైన విషయం తెలిసిందే. ఎస్‌ఐ సాయినాథ్‌ చౌదరి వివరాల మేరకు.. స్థానిక ఆర్బీసీ సెంటర్‌లో నివాసముంటున్న ఎస్‌.కృష్ణ కుమారుడు ఎస్‌.చంద్రశేఖర్‌(13), యోగేష్‌ కుమారుడు వైభవ్‌ యోగేష్‌(13), జి.శ్రీవర్దన్‌(13) తిరుమలలోని ఎస్వీ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నారు. మధ్యాహ్నం భోజన సమయంలో ఇంటికి వెళ్లి పాఠశాలలో జరుగుతున్న పరీక్షకు తిరిగి హాజరుకాలేదు. దీంతో ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. గాలించినా దొరక్కపోవడంతో  తిరుమల టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు సీసీ కెమెరాలు పరిశీలించగా విద్యార్థులు ల్యాప్‌టాప్‌లతో తిరుమల నుంచి ఆర్టీసీ బస్సులో తిరుపతికి చేరుకున్నట్లు గుర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని