vizianagaram: చెక్‌డ్యామ్‌లో ముగ్గురు యువకుల గల్లంతు

విజయనగరం జిల్లా జామి మండలం జాగరం వద్ద చెక్‌డ్యామ్‌లో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు.

Updated : 28 May 2024 11:49 IST

జామి: విజయనగరం జిల్లా జామి మండలం జాగరం వద్ద చెక్‌డ్యామ్‌లో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. గోస్తనీ నది చెక్‌డ్యామ్‌కు మంగళవారం ఉదయం ఈత కోసం ఆరుగురు యువకులు వచ్చారు. మొదట ఒకరు మునిగి పోవడంతో రక్షించడానికి ఒకరి తర్వాత మరొకరు నీటిలోకి దిగారు. ఇలా ముగ్గురు గల్లంతు కాగా.. మిగతావారు ఒడ్డుకు చేరుకుని స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన యువకులను విజయనగరం కంటోన్మెంట్‌కు చెందిన అశోక్‌(19), షాకిత్‌(16), రజిక్‌(14)గా గుర్తించారు. వీరిలో ఒకరి మృతదేహాన్ని వెలికితీశారు. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదానికి చెక్ డ్యామ్‌ దిగువ భాగంలో అక్రమ ఇసుక తవ్వకాలే కారణమని స్థానికులు పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని