టీవీ చూస్తూ తింటున్నారా?
చాలా మందికి టీవీ చూస్తు తినే అలవాటు ఉంటుంది. భోజనం చేస్తూ టీవీ చూడటం లేదా రిలాక్స్గా టీవీ చూస్తున్నాం కాదా అని స్నాక్స్ తినడం చేస్తారు. అయితే ఇలా సమయం, సందర్భం లేకుండా టీవీ చూస్తూ తినడం ద్వారా ఎంత ఆహారం తీసుకుంటున్నామో పట్టించుకోం. దీంతో అవసరానికి
ఇంటర్నెట్ డెస్క్: చాలా మందికి టీవీ చూస్తూ తినే అలవాటు ఉంటుంది. భోజనం చేస్తూ టీవీ చూడటం లేదా రిలాక్స్గా టీవీ చూస్తున్నాం కాదా అని స్నాక్స్ తినడం చేస్తారు. అయితే ఇలా సమయం, సందర్భం లేకుండా టీవీ చూస్తూ తినడం ద్వారా ఎంత ఆహారం తీసుకుంటున్నామో పట్టించుకోం. దీంతో అవసరానికి మించి ఆహారం కడుపులో పడిపోతుంది. ఫలితంగా జీర్ణ సమస్యలు రావడంతోపాటు తొందరగా బరువు పెరిగే అవకాశాలున్నాయి. కాబట్టి టీవీ చూస్తూ మనల్ని మనం మర్చిపోయి తినకుండా.. మితంగా ఆహారం తీసుకునేలా కొన్ని చిట్కాలున్నాయి. వాటిని పాటిస్తే సరి..
టీవీ ముందు కూర్చుంటే ఎందుకు ఎక్కువ తింటాం?
ఏ పని చేస్తున్నా దానిపైనే దృష్టి పెట్టాలి. అప్పుడే చేసే పనిపై అవగాహన ఉంటుంది. అలాగే ఆహారం తినేటప్పుడు కూడా.. దానిపైనే దృష్టి పెడితే పొదుపుగా తినగలం, కడుపు నిండితే మెదడే ఇక తినడం ఆపు అన్నట్లు సంకేతాలు ఇస్తుంది. కానీ, చాలా మంది తినేటప్పుడు టీవీ చూస్తూ మల్టీటాస్కింగ్ చేస్తుంటారు. ఆహారంపై పెట్టాల్సిన శ్రద్ధ టీవీపై పెడుతుంటడంతో.. ఏం తింటున్నాం, ఎంత తింటున్నామనే విషయాలు మెదడు గుర్తించదు. గంటల తరబడి టీవీ ముందే కూర్చొని అధిక మోతాదులో ఆహారం లాగించేస్తారు.
అలవాటును మార్చండి
మీకు ఆకలేస్తే టీవీ ముందుకు భోజనం తెచ్చుకోవడం కాదు, మీరే భోజనం వద్దకు వెళ్లండి. డైనింగ్ టేబుల్ వద్ద కూర్చొని ఏకాగ్రతతో తినండి. తినే ఆహారాన్ని బాగా ఆస్వాదించండి. లేదా టీవీ ఆఫ్ చేసి భోజనం చేయండి. భోజనం చేయడానికి మహా అయితే 15 లేదా 20 నిమిషాలు పడుతుంది. అదే టీవీ చూస్తూ తింటే సమయం తెలియదు. ఆరోగ్యం కోసం పదిహేను నిమిషాలు ఆహారంపై శ్రద్ధపెట్టలేరా?
కుదరదునుకుంటే ఇలా చేసి చూడండి
ఒక్కసారిగా టీవీ చూస్తూ తినడం మానేయమంటే కాస్త కష్టంగానే ఉంటుంది. కాబట్టి మెల్లగా ఆ అలవాటును తగ్గించుకునే ప్రయత్నం చేయండి. టీవీ ముందు కూర్చొనేటప్పుడు భోజనమైనా.. పాప్కార్న్, పకోడీలు, మిర్చి వంటి చిరుతిళ్లయినా తక్కువ మొత్తంలో తెచ్చిపెట్టుకోండి. వాటిని తినడం పూర్తయ్యాక మళ్లీ తెచ్చుకోవడం మానేయండి.
వేరే పనులు చేయండి
ఖాళీగా కూర్చొని టీవీ చూస్తుంటే ఏదో ఒకటి తినాలనే అనిపిస్తుంటుంది. కాబట్టి, తినడం బదులు వేరే పనులు చేయండి. ఉదాహరణకు గోళ్లకు పెయింట్ వేసుకోవడం, కాళ్లకు మసాజ్ చేసుకోవడం వంటి చిన్న చిన్న పనులు చేస్తున్నట్లయితే తినాలనే ఆలోచనలు రాదు.
నీరు ఎక్కువగా తాగండి
టీవీ ముందు కూర్చొని ఏదైనా తినాలనిపిస్తే నీళ్లు తాగండి. కొంతమంది దాహం వేసినా చిరుతిళ్లు తినే అలవాటు ఉంటుంది. వాటి బదులు నీరే తాగితే కడుపు నిండిపోయి ఏమీ తినాలనిపించదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?