USA: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో శిశువు దుర్మరణం: బాధితులు తెలంగాణ వాసులు

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఓ జంట తమ బిడ్డను కోల్పోయింది. వారు కూడా తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.    

Updated : 04 Apr 2024 15:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా(USA)లోని ఫ్లొరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఓ జంట తమ శిశువును కోల్పోయింది. మహబూబ్‌నగర్‌ జిల్లా  జడ్చర్లకు చెందిన బొమ్మిడి అనూష, కొమ్మారెడ్డి సుశీల్‌ అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. ఇటీవల తమ కుమారుడు అద్వైత్‌(11)కు కార్నైల్‌ ఫేషియల్‌ థెరపీ చేయించి తిరిగి వస్తున్న సమయంలో స్టేట్‌ రోడ్‌ 73లో కాటన్‌డేల్‌ వద్ద వీరి కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఏడాది వయసున్న వారి చిన్న కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ శిశువును రక్షించడానికి హెలికాప్టర్‌లో వైద్యశాలకు తరలించినా ప్రయోజనం లేదు. ఈ ఘటనలో సుశీల్‌, అనూష, అద్వైత్‌ తీవ్రంగా గాయపడ్డారు. వీరు ప్రస్తుతం డోథన్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అద్వైత్‌, సుశీల్‌ ఐసీయూలో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు