TSPSC: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మరో సభ్యుడి రాజీనామా
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)లో సభ్యుల రాజీనామా కొనసాగుతోంది. తాజాగా మరో సభ్యుడు రాజీనామా చేశారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) లో సభ్యుల రాజీనామా కొనసాగుతోంది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్రెడ్డి, కమిషన్ సభ్యుడు సత్యనారాయణ రాజీనామా చేశారు. తాజాగా మరో సభ్యుడు కారం రవీందర్ రెడ్డి రాజీనామా చేసినట్టు శుక్రవారం ప్రకటించారు. ఇద్దరు ఉద్యోగుల తప్పిదం కారణంగా టీఎస్పీఎస్సీ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందంటూ రాజీనామా అనంతరం ఒక ప్రకటనలో రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. ఆ అపవాదును సంబంధం లేని వారు మోయాల్సి వస్తోందన్నారు. కొంతమంది స్వార్థపూరిత ఆలోచనలకు అనుగుణంగా పనిచేయలేదనే సంస్థలో జరిగిన పరిణామాలను తమకు ఆపాదించారని ఆవేదన వ్యక్తం చేశారు. కమిషన్లో సరిపడా సభ్యులు, సిబ్బంది లేకపోయినా.. నిరుద్యోగులకు మంచి జరగాలనే ఉద్దేశంతో నియామక ప్రక్రియను వేగవంతం చేశామని గుర్తు చేశారు. కమిషన్పై ఉన్న అపోహలను నిరుద్యోగులు పక్కన పెట్టాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం మళ్లీ పెరుగుతోంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం