TSRTC: మహాలక్ష్మి పథకం.. 45 రోజుల్లో 12 కోట్ల మంది మహిళలు ప్రయాణం: సజ్జనార్‌

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చరిత్రాత్మక నిర్ణయమని తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ అన్నారు.

Updated : 28 Jan 2024 17:35 IST

హైదరాబాద్‌: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చరిత్రాత్మక నిర్ణయమని తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ అన్నారు. 45 రోజుల్లో 12కోట్లకు పైగా మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారని తెలిపారు. నాంపల్లిలోని తెలుగు వర్సిటీలో బ్లైండ్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్‌ లూయిస్‌ బ్రెయిలీ 215వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.

‘‘ఉచిత ప్రయాణం కారణంగా వికలాంగులకు కేటాయించిన సీట్లలో కూడా మహిళలు కూర్చుంటున్నారు. ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు నా దృష్టికి వచ్చాయి. త్వరలో 2,375 కొత్త బస్సులు తీసుకుంటున్నాం. అప్పుడు కొంత వెసులుబాటు కలుగుతుంది. అవసరమైతే వికలాంగుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసే విధంగా ఆర్టీసీ యాజమాన్యం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. అనౌన్స్‌మెంట్‌, ఎంక్వయిరీ రూమ్‌ ఉద్యోగాల్లో అంధులకు అవకాశం కల్పిస్తాం’’ అని సజ్జనార్‌ హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని