Kishan Reddy: 2024లో ప్రపంచవ్యాప్తంగా భారత్‌ కీలకపాత్ర: కిషన్‌రెడ్డి

భారతదేశానికి 2024 కీలకమైన ఏడాదని తెలంగాణ భాజపా అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.

Published : 01 Jan 2024 10:55 IST

తిరుమల: భారతదేశానికి 2024 కీలకమైన ఏడాదని తెలంగాణ భాజపా అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. నూతన సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీవారిని ఆయన సతీసమేతంగా దర్శించుకున్నారు. తితిదే అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ద్వారా దర్శన అనంతరం ఆలయం వెలుపల కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. 2024లో ప్రపంచవ్యాప్తంగా భారత్‌ కీలక పాత్ర పోషించనుందన్నారు. ఇజ్రాయెల్‌-గాజా, రష్యా-ఉక్రెయిన్‌ వంటి ప్రపంచ దేశాల సమస్యలు ఈ ఏడాదిలో పరిష్కారమయ్యే అవకాశం ఉందన్నారు. అందులో భారత్‌ కీలక పాత్ర షోషించనుందని చెప్పారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం ఈ ఏడాదిలోనే జరగనుందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని