యూనివర్సిటీలో కర్రాబిళ్ల.. తొక్కుడు బిళ్ల.. గోలీలాట!
కర్రాబిళ్ల.. తొక్కుడు బిళ్ల.. గోలీలాట. పేర్లు చదవగానే చిన్నతనంలో మీరు ఆడుకున్న సందర్భాలు గుర్తొచ్చాయా? స్కూల్ నుంచి ఇంటికి రాగానే స్నేహితులతో సరదాగా ఆడుకున్న ఆటలవీ...
లఖ్నవూ: కర్రాబిళ్ల.. తొక్కుడు బిళ్ల.. గోలీలాట. పేర్లు చదవగానే చిన్నతనంలో మీరు ఆడుకున్న సందర్భాలు గుర్తొచ్చాయా? స్కూల్ నుంచి ఇంటికి రాగానే స్నేహితులతో సరదాగా ఆడుకున్న సంప్రదాయ ఆటలవీ. కానీ, ఈ మిలీనియమ్ పిల్లలకు వీటి గురించి ఏమాత్రం తెలియదు. ఇప్పుడందరూ మొబైల్ ఫోన్, ప్లే స్టేషన్ అంటూ డిజిటల్ గేమ్స్ మాత్రమే ఆడుతున్నారు. అయితే, తిరిగి ఆ సంప్రదాయ ఆటలకు జీవం పోసేందుకు ఉత్తర్ప్రదేశ్లోని ఓ యూనివర్సిటీ శ్రీకారం చుట్టింది.
మేరఠ్లోని చౌదరీ చరణ్ సింగ్ యూనివర్సిటీ(సీసీఎస్యూ)లో ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులో రెగ్యులర్గా నేర్పించే వాలీబాల్, రెజ్లింగ్, స్విమ్మింగ్, క్రికెట్, బాస్కెట్బాల్తోపాటు కర్రాబిళ్ల, గోలీలాట, తొక్కుడు బిళ్ల ఆటలను కూడా చేర్చింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020లో భాగంగానే ‘ది ట్రెడిషనల్ గేమ్స్ ఆఫ్ ఇండియా’ పేరుతో ఈ ఆటలను ప్రవేశపెడుతున్నామని యూనివర్సిటీ ప్రతినిధులు వెల్లడించారు. ఈ విధంగానైనా మన సంప్రదాయ ఆటలకు ఒక గుర్తింపు లభిస్తుందని వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కేకే పాండే తెలిపారు. ‘‘మనం చిన్నప్పుడు ఎంతో ఇష్టపడి ఆడుకున్న ఆటలు ఇప్పుడు ఉనికిని కోల్పోతున్నాయి. తిరిగి వాటిని సమాజంలోకి తీసుకురావాలనేదే మా ప్రయత్నం. ఈ కొత్త కోర్సు నేర్చుకునే ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్లు భవిష్యత్తులో పాఠశాలల్లో పీఈటీలుగా చేరినప్పుడు పిల్లలతో ఈ ఆటలను ఆడించే అవకాశముంటుంది. ఈ ఆటలు కేవలం వినోదాన్నే కాదు.. శారీరక దృఢత్వాన్ని ఇస్తాయి. విద్యార్థుల్లో ఏకాగ్రతను పెంచుతాయి’’అని చెప్పారు.
యూపీలోని లఖ్నవూ యూనివర్సిటీ కూడా గతేడాది విభిన్న కోర్సును ప్రవేశపెట్టింది. ఎం.ఎడ్ కోర్సులో ‘ఎడ్యుకేషన్ ఆఫ్ హ్యాపీనెస్’ పేరుతో పాఠ్యాంశాన్ని చేర్చింది. ఈ పాఠ్యాంశం ద్వారా అసలైన ఆనందం అంటే ఏంటి? అనే విషయాన్ని బోధిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం