టీచర్.. వృత్తి వ్యవసాయం..లక్షల సంపాదన
పుస్తకాలు విజ్ఞాన గనులు. వాటి ద్వారా వచ్చే జ్ఞానంతో కొందరు ఉద్యోగాలు సంపాదిస్తే.. మరి కొందరు పారిశ్రామిక వేత్తలవుతువుతుంటారు. కానీ, బాగా చదువుకొని వ్యవసాయం చేసేవాళ్లు చాలా తక్కువ. ..
పుస్తకాలు విజ్ఞాన గనులు. వాటి ద్వారా వచ్చే జ్ఞానంతో కొందరు ఉద్యోగాలు సంపాదిస్తే.. మరి కొందరు పారిశ్రామిక వేత్తలవుతుంటారు. కానీ, బాగా చదువుకొని వ్యవసాయం చేసేవాళ్లు చాలా తక్కువ. ఇటీవల కొంతమంది వ్యవసాయంపై మక్కువ చూపిస్తున్నప్పటికీ, అలాంటి వాళ్లని వేళ్ల మీద లెక్కించొచ్చు. అలాంటిది ప్రభుత్వ ఉద్యోగంలో దాదాపు పదేళ్లకు పైగా సేవలందిస్తూనే.. వ్యవసాయం చేస్తూ రూ.లక్షలు సంపాదిస్తున్నాడు ఓ ఉపాధ్యాయుడు. తాను చేయడమే కాకుండా వందల మందికి మార్గదర్శిగా నిలుస్తున్నాడు.
ఉత్తరప్రదేశ్లోని బారాబంకి జిల్లా దౌలత్పూర్ గ్రామానికి చెందిన అమరేంద్ర ప్రతాప్ సింగ్ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. దాదాపు 10 ఏళ్లకు పైగా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. కానీ, ఆయనకు వ్యవసాయం చేయాలనే కోరిక ఉండేది. దాదాపు నెలకి రూ.1.20 లక్షల జీతమొస్తున్న ఉద్యోగాన్ని వదిలి వ్యవసాయం చేయడమంటే మాటలా? బంధువులు వద్దన్నారు. కోరి కష్టాలు తెచ్చుకోవడమెందుకురా? అని స్నేహితులు అడ్డుపడ్డారు. కానీ, అమరేంద్ర వినిపించుకోలేదు. వెంటనే ఉద్యోగం మానేయకుండా ప్రయోగాత్మకంగా కొంత వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. వ్యవసాయం ద్వారానే లక్షలు సంపాదించొచ్చని నిరూపించాలనుకున్నాడు. ఆ ప్రాంతంలో వ్యవసాయం చేయాలంటే కాస్త కష్టమే. అందరూ సంప్రదాయ తృణధాన్యాలు, గోధుమలు, చెరకు పండించేవారు. అయితే వీటి ద్వారా పెద్దమొత్తంలో సంపాదించడం కష్టం. ఎందుకంటే దిగుబడి రావడానికి ఎక్కువ సమయం పడుతుంది. చెరకు ద్వారా అధిక దిగుబడికి అవకాశమున్నప్పటికీ దాదాపు రెండేళ్లు నిరీక్షించాల్సిన పరిస్థితి.
విలక్షణ ప్రయోగాలతో..
వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఓ వైపు ఉద్యోగం చేస్తూనే.. దగ్గర్లోని పట్టణంలో వ్యవసాయ మెలకువలు తెలుసుకునేందుకు శిక్షణ తీసుకున్నాడు. అంతేకాకుండా యూట్యూబ్లో వీడియోలు చూస్తూ మరింత సమాచారాన్ని సేకరించేవాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక ఎకరం పొలంలో అరటి తోట పెంచడం మొదలుపెట్టాడు. మొదట్లో అంతగా అవగాహన లేకపోవడంతో నష్టాలే వచ్చాయి. అయినా తన పట్టుదలను వీడలేదు. ఒకే పొలంలో రకరకాల పంటలను వేసి ప్రయోగం చేశాడు. ఎకరా పొలంలోనే అరటి తోటను పెంచుతూ అంతర పంటలుగా అల్లం, పసుపు, క్యాబేజీ పంటలను వేశాడు. దీంతో కాస్త ఉపశమనం లభించినట్లయింది. అల్లంతో పెద్దగా ఉపయోగం లేకపోయినా పసుపుతో బాగా కలిసొచ్చిందట. దీంతో ఇదే తరహాలో అమరేందర్ సేద్యాన్ని కొనసాగించాడు.
అంతర పంటలు వేస్తూ..
ఈ లోపు వ్యవసాయంపై పూర్తిగా అవగాహన వచ్చింది. తనకున్న మొత్తం 30 ఎకరాలతోపాటు, మరో 30 ఎకరాలు కౌలుకు తీసుకొని అరటి పంట, అందులో కొన్ని అంతర పంటలను వేయడం ప్రారంభించాడు. పసుపు పంటలో వచ్చిన లాభాన్ని అరటి తోటలకు మదుపుగా పెట్టేవాడు. ఇలా ఏడాది పొడవునా ఆదాయం వచ్చేలా ప్రణాళిక వేసుకున్నాడు. అలా తన ప్రయోగాలను విస్తరించుకుంటూ అంతర పంటలుగా వాటర్ మిలన్, మస్క్మిలన్, బంగాళాదుంప, స్ట్రాబెర్రీ, క్యాప్సికం తదితర పంటలు వేసేవాడు. అంతేకాకుండా దగ్గర్లోని వ్యవసాయ క్షేత్రాలకు, ప్రయోగశాలలకు వెళ్లి కొత్త కొత్త వంగడాలు, వాణిజ్య పంటల గురించి తెలుసుకునే వాడు. ఆయా పద్ధతులను తాను కూడా అవలంబించేవాడు. తొలుత నష్టమొచ్చినా.. క్రమంగా లాభాలు వచ్చేవి. పంట వ్యర్థాలను కాల్చేయకుండా, వాటిని సేంద్రియ ఎరువులుగా తర్వాతి పంటలకు ఉపయోగించేవాడు. దీంతో తన వ్యవసాయ క్షేత్రంలో వ్యర్థమనే పదానికే చోటు లేకుండా చేశాడు.
మార్గనిర్దేశకుడిగా..
అధిక దిగుబడి సాధించేందుకు కాలానుగుణంగా మారుస్తున్నాడు. మొత్తం 30 ఎకరాల్లో కూరగాయలు, పళ్లు పండిస్తూ... మిగతా 30 ఎకరాల్లో చెరకు, గోదుమలు లాంటి పంటలు వేస్తున్నాడు. దీంతో ఏడాదికి రూ.1 కోటి వరకు ఆదాయమొస్తోందని, దాదాపు 70 లక్షలు పెట్టుబడిగా పోయినా ఏడాదికి 30 లక్షల లాభం మిగులుతోందట. తక్కువ నీటితో వ్యవసాయం చేసేలా ఇటీవల డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని కూడా ఉపయోగిస్తున్నట్లు రైతుగా మారిన ఈ ఉపాధ్యాయుడు చెబుతున్నాడు. కేవలం తానొక్కడే కాకుండా తన అనుభవంతో చుట్టుపక్కల రైతులకు మార్గనిర్దేశకుడిగా నిలుస్తున్నాడు. రైతుల సందేహాలు తీరుస్తూ మరింత మందిని ప్రోత్సహిస్తున్నాడు. దాదాపు 350 మంది రైతులు ఆయన మార్గనిర్దేశంలో నడుస్తున్నారట. ‘‘ప్రతి రైతుకీ సమస్యలు ఉన్నాయి. ఈ మధ్యవర్తుల మోసానికి ఎందరో బలైపోతున్నారు. తమ పంటలకు సరైన మద్దతు ధర లభించడం లేదు. నేరుగా వినియోగదారులకే తమ పంటలను చేరవేసేలా ప్రణాళికలు రచిస్తున్నాం’’ అని అమరేందర్ చెబుతున్నాడు.
-ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
గోదావరిలో నిన్నంతా హెచ్చుతగ్గులతో కొనసాగిన భారీ వరద శనివారం ఉదయం నుంచి పెరుగుతోంది. -
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవోగా వెంకయ్య చౌదరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. -
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
ముఖ్యమంత్రి ఆదేశాలతో డ్రగ్స్ నియంత్రణకు ఎక్సైజ్ శాఖ తీవ్రంగా కృషి చేస్తోందని అబ్కారీ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్రెడ్డి తెలిపారు. -
భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు 52.1 అడుగుకు చేరుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ను పెంచుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. -
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
నీతి ఆయోగ్ సమావేశం రాష్ట్రపతి భవన్లో ప్రారంభమైంది. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించనున్నారు. -
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
మదనల్లె సబ్కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసుపై విచారణ కొనసాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో ఆరో రోజు విచారణ చేపట్టారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్