Venu Swamy: ఎన్నికల ఫలితాలపై వేణుస్వామి వీడియో.. ఏం చెప్పారంటే..
ఎన్నికల ఫలితాలపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి వీడియో విడుదల చేశారు. తన లెక్క తప్పిందన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఎన్నికల ఫలితాలపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి వీడియో విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో తాను అనుకున్న లెక్క తప్పిందన్నారు. చెప్పిన రెండిట్లో ఒకటి నిజమైందని మరో విషయంలో అంచనాలు తప్పాయన్నారు.
‘దేశం, రాష్ట్రవ్యాప్తంగా నా అంచనా ప్రకారం ఎవరు గెలుస్తారో చెప్పాను. దేశంలో మోదీ ప్రాభవం తగ్గుతుందని చెప్పాను. అది జరిగింది. అలాగే ఆంధ్రాలో జగన్ మోహన్ రెడ్డి గెలుస్తారని భావించాను. ఈవిషయంలో నా లెక్క తప్పింది. నాకున్న పరిజ్ఞానం, విద్యను అనుసరించి నా అభిప్రాయాన్ని వెల్లడించాను. పోటీచేసిన వారి జాతకాన్ని ఆధారంగా చేసుకొని ఫలితాలను చెప్పాను. ఆంధ్రప్రదేశ్ విషయంలో నేను చెప్పింది వందశాతం తప్పని అంగీకరిస్తున్నాను’ అని పేర్కొన్నారు. ఇటీవల వేణుస్వామి ఓ ప్రముఖ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ మరోసారి సీఎం అవుతారని చెప్పిన విషయం తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ వెలువడిన తర్వాత కూడా వాటిని తప్పుపడుతూ కామెంట్స్ చేశారు. నేడు విడుదలైన ఫలితాల్లో కూటమి అఖండ విజయం దిశగా దూసుకుపోతుండడంతో ఆయన తన అంచనాలు తప్పాయని వివరణ ఇస్తూ వీడియో విడుదల చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం మళ్లీ పెరుగుతోంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?