CBI: వివేకా ఇంట్లో వైఫై రూటర్లకు కనెక్టైన వారి వివరాలు సేకరిస్తున్నాం: సీబీఐ

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు ఛార్జ్‌షీట్‌లో సీబీఐ పలు అంశాలను ప్రస్తావించింది. ఫొటోలు, గూగుల్‌ టేకౌట్‌, ఫోన్ల లొకేషన్‌ డేటాను సీబీఐ కోర్టుకు సమర్పించింది. గత నెల 30న సమర్పించిన ఛార్జ్‌షీట్‌ను సీబీఐ కోర్టు ఇటీవల విచారణకు స్వీకరించింది. 

Published : 21 Jul 2023 11:17 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు ఛార్జ్‌షీట్‌లో సీబీఐ పలు అంశాలను ప్రస్తావించింది. ఫొటోలు, గూగుల్‌ టేకౌట్‌, ఫోన్ల లొకేషన్‌ డేటాను సీబీఐ కోర్టుకు సమర్పించింది. గత నెల 30న సమర్పించిన ఛార్జ్‌షీట్‌ను సీబీఐ కోర్టు ఇటీవల విచారణకు స్వీకరించింది. 

‘‘వివేకా హత్యకు ఎంపీ అవినాష్‌ రెడ్డి, భాస్కర్‌ రెడ్డి కుట్ర చేశారు. వివేక పీఏ కృష్ణారెడ్డిపై అనుమానాలు ఉన్నప్పటికీ తగిన ఆధారాలు లభించలేదు. సాక్ష్యాల చెరిపివేత సమయంలో వైఎస్ మనోహర్ రెడ్డి ఉన్నా.. ఆయన ప్రమేయం ఇంకా నిర్ధారణ కాలేదు. వివేకా లేఖపై నిన్ హైడ్రిన్ పరీక్ష నివేదిక రావాల్సి ఉంది. ఆయన ఇంట్లో వైఫై రూటర్లకు కనెక్టైన వారి వివరాలను సేకరిస్తున్నాం. దానికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని అమెరికా అధికారులను కోరాం. పలు మొబైల్ ఫోన్ల ఫొరెన్సిక్ నివేదికలు త్రివేండ్రం సీ డాక్ నుంచి అందాల్సి ఉంది’’ అని కోర్టుకు సమర్పించిన ఛార్జిషీట్‌లో సీబీఐ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని