AP news: రాజమహేంద్రవరం పరిధిలో 23 మంది వాలంటీర్ల సస్పెన్షన్‌

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిధిలో 23 మంది వాలంటీర్లను సస్పెండ్‌ చేశారు.

Published : 21 Mar 2024 14:33 IST

రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిధిలో 23 మంది వాలంటీర్లను సస్పెండ్‌ చేశారు. వైకాపాకు అనుకూలంగా పని చేస్తున్నారని ఇటీవల వారిపై తెదేపా నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వాలంటీర్లను సస్పెండ్‌ చేస్తూ రిటర్నింగ్‌ అధికారి ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించకుండా వైకాపా నిర్వహించిన ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్న 45 మంది వాలంటీర్లను అధికారులు బుధవారం విధుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండాలని ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని