మోచేతిపై దెబ్బ..జివ్వుమంటుంది ఎందుకు?
శరీరంపై ఎక్కడ దెబ్బ తగిలినా కాస్త బరించగలమేమో గానీ, మోచేతి కీలుపై తగిలితే మాత్రం ఒక్కసారిగా జివ్వు మంటుంది. వేళ్ల చివరి నుంచి మెదడు వరకు కరెంట్ షాక్ కొట్టినట్లవుతుంది...
ఇంటర్నెట్డెస్క్: శరీరంపై ఎక్కడ దెబ్బ తగిలినా కాస్త భరించగలమేమో గానీ, మోచేతి కీలుపై తగిలితే మాత్రం ఒక్కసారిగా జివ్వుమంటుంది. వేళ్ల చివరి నుంచి మెదడు వరకు కరెంట్ షాక్ కొట్టినట్లవుతుంది. కొద్ది సేపటి వరకు స్పర్శ కూడా తెలీదు. అసలు ఇలా ఎందుకు అవుతుందో తెలుసా?
మోచేతిపై దెబ్బ తగిలితే సాధారణంగా ఎముకపై తగిలింది అనుకుంటారు. కానీ, దెబ్బ తగిలింది ఎముకకు కాదు.. నరానికి. ఈ విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. మన శరీరీరంలో ఎన్నో నరాలు ఉంటాయి. ఇవన్నీ మెదడు నుంచి శరీరంలోని వివిధ భాగాలకు అనుసంధానించి ఉంటాయి. శరీరభాగాల నుంచి సమాచారాన్ని మెదడుకు, అక్కడి నుంచి ఆదేశాలను శరీర అవయవాలకు చేరవేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. శరీరంలో ప్రతి నరానికి ఎముకగానీ, కండరాలుగానీ రక్షణ ఇస్తాయి. అంటే వాటిని ఆనుకుంటూ నాడీ వ్యవస్థ నిర్మితమై ఉంటుంది. కానీ, మోచేతి కీలు దగ్గర మాత్రం నరం బయటకు ఉంటుంది. దానిపై చర్మం మాత్రమే కప్పి ఉంటుంది. ఈ నరాన్నే ‘అల్నార్ నరం’ అంటారు.
అల్నార్ నరం.. చిటికెన, ఉంగరపు వేళ్ల చివరి భాగం నుంచి వెన్నెముక, మెడ మీదుగా మెదడు వరకు వ్యాపించి ఉంటుంది. మోచేతి కీలువద్ద నరానికి స్వల్ప రక్షణే ఉండటం వల్ల దెబ్బతగిలినప్పుడు అది నేరుగా నరంపై ప్రభావం చూపిస్తుంది. ఎముక ఉపరితలానికి, ఢీ కొట్టిన వస్తువుకు మధ్య నరం ఇరుక్కుపోయి ఒక్కసారిగా ఒత్తిడి పెరిగిపోయి.. కరెంట్ షాక్ తగిలినట్లు జివ్వుమంటూ స్పర్శ కోల్పోతాము. కొన్నిసార్లు కళ్లు బైర్లు కమ్మినట్లువుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
నీతి ఆయోగ్ సమావేశం రాష్ట్రపతి భవన్లో ప్రారంభమైంది. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించనున్నారు. -
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
మదనల్లె సబ్కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసుపై విచారణ కొనసాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో ఆరో రోజు విచారణ చేపట్టారు. -
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం మళ్లీ పెరుగుతోంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల