అందం కోసం పాకులాడితే.. చివరికి!
ప్రస్తుత అత్యాధునిక వైద్యశాస్త్రంలో మనిషి రూపురేఖలు మార్చడం సర్వ సాధారణ విషయమైపోయింది. కొందరు తమ ముఖం అందంగా లేదని,
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత అత్యాధునిక వైద్యశాస్త్రంలో మనిషి రూపురేఖలు మార్చడం సర్వ సాధారణ విషయమైపోయింది. కొందరు తమ ముఖం అందంగా లేదని, ముక్కు, పెదాలు సరిగా లేవంటూ శస్త్రచికిత్సలు చేయించుకుంటుంటారు. అయితే కొన్నిసార్లు వాటి వల్ల అనర్థాలూ జరుగుతుంటాయి. ఇటీవల ఓ యువతి తన ముఖానికి శస్త్రచికిత్స చేయించుకుంది. ఎంతో అందంగా తయారవుతుందనుకున్నా ఆమె ముఖం.. ఇప్పుడు సగం పక్షవాతానికి గురైంది. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది.
మనదేశంలో కొందరు సినీ సెలబ్రిటీలు ముఖంలో కొన్ని భాగాలకు శస్త్రచికిత్సలు చేయించుకున్న విషయం తెలిసిందే. చైనా, దక్షిణకొరియా వంటి దేశాల్లో మాత్రం సామాన్యులు సైతం ముఖానికి శస్త్రచికిత్స చేయించుకుంటుంటారు. ఆయా దేశాల్లో సాధారణ ఆస్పత్రులకంటే ఇలా మనిషి ముఖాన్ని అందంగా కనిపించేందుకు శస్త్రచికిత్సలు చేసే ఆస్పత్రులే ఎక్కువ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చైనాలోని హాంగ్జు నగరానికి చెందిన జావో అనే యువతి తన ముఖంపై ముడతలు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది.
అప్పటికే పలుమార్లు శస్త్రచికిత్సలు చేయించుకున్న ఆ యువతి గత నెల 12న కూడా శస్త్రచికిత్స చేయించుకుంది. వైద్యులు ముఖంపై ఉన్న ముడతలకు సూది మందులిచ్చారు. అయితే ఈ సారి ఆమెకు జరిగిన శస్త్రచికిత్స విఫలమైంది. సెప్టెంబర్ 19న ఆమె ముఖంలో సగభాగం పక్షవాతానికి గురైంది. నోరు వంకరపోయింది. ఎడమవైపు కనుబొమ్మలు పైకి లేచి అలాగే ఉండిపోయాయి. ఎడమ కన్నును పూర్తిగా మూయలేకపోతోంది. వంకరపోయిన నోరుతో సరిగా భోజనం కూడా చేయలేకపోతోంది.
వేరే ఆస్పత్రుల్లో వైద్య నిపుణులతో పరీక్షలు చేయించగా.. జావోకి ఫేషియల్ నర్వ్ పెరాలసిస్ వచ్చినట్లు వెల్లడైంది. చికిత్స చేసినా ముఖం ఎప్పటికి సాధారణ స్థితికి వస్తుందో వైద్యులు చెప్పలేకపోతున్నారు. జావో ముఖం శాశ్వతంగా పక్షవాతంతోనే ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. తన ముఖం ఇలా మారడానికి కారణమైన ఆస్పత్రిపై జావో కేసు వేసింది. ఓ ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జావో ఈ వివరాలు వెల్లడించింది. ఉదయాన్నే తన ముఖాన్ని అద్దంలో చూసుకుంటే ఎంతో బాధ కలుగుతుందని, జీవితంపై విరక్తి పుడుతోందని ఆవేదన వ్యక్తం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
గోదావరిలో నిన్నంతా హెచ్చుతగ్గులతో కొనసాగిన భారీ వరద శనివారం ఉదయం నుంచి పెరుగుతోంది. -
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవోగా వెంకయ్య చౌదరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. -
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
ముఖ్యమంత్రి ఆదేశాలతో డ్రగ్స్ నియంత్రణకు ఎక్సైజ్ శాఖ తీవ్రంగా కృషి చేస్తోందని అబ్కారీ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్రెడ్డి తెలిపారు. -
భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు 52.1 అడుగుకు చేరుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ను పెంచుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. -
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
నీతి ఆయోగ్ సమావేశం రాష్ట్రపతి భవన్లో ప్రారంభమైంది. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించనున్నారు. -
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
మదనల్లె సబ్కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసుపై విచారణ కొనసాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో ఆరో రోజు విచారణ చేపట్టారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి