Yadadri: యాదాద్రి ఆలయానికి రూ.4కోట్లకు పైగా హుండీ ఆదాయం

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో హుండీ ఆదాయం భారీగా లభించింది.

Published : 28 May 2024 22:04 IST

యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో హుండీ ఆదాయం భారీగా లభించింది. మంగళవారం సత్యనారాయణస్వామి వ్రత మండపంలో 35 రోజులకు సంబంధించి హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. స్వామి వారికి కానుకల రూపంలో రూ.3,93,88,092ల నగదు, 174 గ్రాముల బంగారం, ఏడు కిలోల వెండి ఖజానాకు సమకూరిందని ఈవో భాస్కర్‌రావు తెలిపారు. వివిధ దేశాలకు సంబంధించిన కరెన్సీ నోట్లను కూడా భక్తులు స్వామివారికి సమర్పించినట్టు చెప్పారు. వేసవి సెలవులు కావడంతో గత కొన్ని రోజులు యాదాద్రి ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు